తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల కోసం అతనెంత శ్రమించాడో, ఎంత అద్భుతంగా లుక్ను మార్చుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు తన నుంచి రాబోయే ‘పెద్ది’ కోసం కూడా ఎంత కష్టపడ్డాడో ప్రోమోల్లో కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇందులో కుస్తీ యోధుడి పాత్ర కోసం చరణ్ ఒళ్లు హూనం చేసుకునేలా కష్టపడ్డాడని, గాయాల పాలు కూడా అయ్యాడని టీం అంతా చెబుతోంది. కుస్తీ పోటీల సన్నివేశాల్లో భాగంగానే చేతిని దెబ్బ తీసుకుని రిస్ట్ బేస్తో కనిపిస్తున్నాడు. దాంతోనే ప్రమోషన్లలో కనిపిస్తున్నాడు.
‘పెద్ది’ షూటింగ్లో భాగంగా చెయ్యి బాగా దెబ్బ తిందని, దానికి సర్జరీ కూడా అవసరమని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో సమాచారాన్ని పంచుకున్నాడు చరణ్.
‘పెద్ది’లో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను 30 రోజుల పాటు చిత్రీకరించామని, ఆ సమయంలో మొదట్లోనే కొంచెం నొప్పి అనిపించిందని.. కానీ చేతికి ఏమైందో తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసుకునేందుకు తనకు భయం వేసిందని.. ఒక వేళ చీలిక (టియర్) ఉంటే షూట్ కొనసాగించలేం కదా అనిపించిందని చరణ్ చెప్పాడు.
ఐతే మొదట్లో ఒక చిన్న చీలిక వచ్చి ఉంటుందని అనుకుంటే.. షూటింగ్ అంతా అయ్యాక స్కాన్ చూసుకుంటే ఏకంగా 7 చోట్ల చీలికలు ఉన్నట్లు తెలిసిందని చరణ్ తెలిపాడు. చేతికి సర్జరీ అవసరం అయిందని, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స చేసుకుంటే ప్రమోషన్లకు దూరం కావాల్సి ఉంటుందని, అందుకే బ్రేస్ వేసుకుని మేనేజ్ చేస్తున్నానని.. సినిమా విడుదల తర్వాత సర్జరీ చేయించుకుంటానని చరణ్ తెలిపాడు. కుస్తీ పోటీల్లో రెజ్లర్లు చేతులు పట్టుకునే ఒకరినొకరు నెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ రెజ్లర్లతో కలిసి సాధన చేయడం, చిత్రీకరణలో పాల్గొనడంతో చరణ్ చేతికి బాగానే గాయాలైనట్లు కనిపిస్తోంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…