తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను తనవైపు తిప్పుకున్నాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాల చుట్టూ టాలీవుడ్ తిరుగుతున్న టైంలో ఇలాంటి గొప్ప సినిమా రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ దర్శకుడికి పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. రెండో సినిమా ‘వేదం’ కమర్షియల్గా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా.. దాంతోనూ దర్శకుడిగా తన అభిరుచిని చాటాడు క్రిష్.
ఆపై కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో క్రిష్ దర్శకుడిగా తన స్థాయిని చాటాడు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో దర్శకుడిగా పతాక స్థాయిని అందుకున్న ఆయనకు.. ఆ తర్వాత ఏదీ కలిసి రాలేదు. బాలీవుడ్లో చేసిన ‘మణికర్ణిక’ మధ్యలో ఆయన చేజారింది. ఆపై తెలుగులో తీసిన యన్.టి.ఆర్, కొండపొలం చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గత ఏడాది ‘ఘాటి’తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తే అది ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది.
‘ఘాటి’ రిలీజ్ తర్వాత క్రిష్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఆయన కొత్త సినిమా గురించి అసలే కబురూ వినిపించలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం క్రిష్ సైలెంటుగా ఒక సినిమా చేస్తున్నాడట. ఈసారి కెరీర్లో ఎన్నడూ చేయని ప్రయోగం చేస్తున్నాడట క్రిష్. అందరూ కొత్త వాళ్లతో ఒక రోడ్ ట్రిప్ మూవీ చేస్తున్నాడట క్రిష్. కెరీర్లో లో బడ్జెట్ సినిమాలు, స్టార్లు కాని వాళ్లతో ట్రై చేశాడు కానీ.. పూర్తిగా కొత్త వాళ్లతో ఈ దర్శకుడు సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం ఆయన ఈశాన్య ప్రాంత నేపథ్యాన్ని తీసుకున్నాడట. అక్కడే చిత్రీకరణ జరుగుతోంది.
ఎప్పట్లాగే సొంత బేనర్ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’లోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్లున్నాడు క్రిష్. ‘ఘాటి’తో భారీ నష్టాలు వచ్చినప్పటికీ ఎక్కువ టైం తీసుకోకుండా తన సంస్థలో ఇంకో సినిమా చేయడం విశేషమే. ఈసారైనా క్రిష్ దర్శకుడిగా తన స్థాయికి తగ్గ సినిమా తీసి, కమర్షియల్గానూ మంచి ఫలితం అందుకుంటే చూడాలన్నది అభిమానుల కోరిక. మొత్తం సినిమా పూర్తి చేశాకే దాని వివరాలు వెల్లడించాలనుకుంటున్నాడట క్రిష్.
This post was last modified on May 29, 2026 6:21 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…