తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను తనవైపు తిప్పుకున్నాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాల చుట్టూ టాలీవుడ్ తిరుగుతున్న టైంలో ఇలాంటి గొప్ప సినిమా రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ దర్శకుడికి పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. రెండో సినిమా ‘వేదం’ కమర్షియల్గా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా.. దాంతోనూ దర్శకుడిగా తన అభిరుచిని చాటాడు క్రిష్.
ఆపై కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో క్రిష్ దర్శకుడిగా తన స్థాయిని చాటాడు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో దర్శకుడిగా పతాక స్థాయిని అందుకున్న ఆయనకు.. ఆ తర్వాత ఏదీ కలిసి రాలేదు. బాలీవుడ్లో చేసిన ‘మణికర్ణిక’ మధ్యలో ఆయన చేజారింది. ఆపై తెలుగులో తీసిన యన్.టి.ఆర్, కొండపొలం చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గత ఏడాది ‘ఘాటి’తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తే అది ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది.
‘ఘాటి’ రిలీజ్ తర్వాత క్రిష్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఆయన కొత్త సినిమా గురించి అసలే కబురూ వినిపించలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం క్రిష్ సైలెంటుగా ఒక సినిమా చేస్తున్నాడట. ఈసారి కెరీర్లో ఎన్నడూ చేయని ప్రయోగం చేస్తున్నాడట క్రిష్. అందరూ కొత్త వాళ్లతో ఒక రోడ్ ట్రిప్ మూవీ చేస్తున్నాడట క్రిష్. కెరీర్లో లో బడ్జెట్ సినిమాలు, స్టార్లు కాని వాళ్లతో ట్రై చేశాడు కానీ.. పూర్తిగా కొత్త వాళ్లతో ఈ దర్శకుడు సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం ఆయన ఈశాన్య ప్రాంత నేపథ్యాన్ని తీసుకున్నాడట. అక్కడే చిత్రీకరణ జరుగుతోంది.
ఎప్పట్లాగే సొంత బేనర్ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’లోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్లున్నాడు క్రిష్. ‘ఘాటి’తో భారీ నష్టాలు వచ్చినప్పటికీ ఎక్కువ టైం తీసుకోకుండా తన సంస్థలో ఇంకో సినిమా చేయడం విశేషమే. ఈసారైనా క్రిష్ దర్శకుడిగా తన స్థాయికి తగ్గ సినిమా తీసి, కమర్షియల్గానూ మంచి ఫలితం అందుకుంటే చూడాలన్నది అభిమానుల కోరిక. మొత్తం సినిమా పూర్తి చేశాకే దాని వివరాలు వెల్లడించాలనుకుంటున్నాడట క్రిష్.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…