2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఈసారి ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పేందుకు తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రజలను నిరంతరం కలుసుకుని జగన్ మాయ మాటలను విడమర్చి చెబుతారని, తద్వారా వైసీపీకి మరో అవకాశం దక్కకుండా చూస్తామని అచ్చెన్న అన్నారు. మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పారు. వాటిని వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించిందని తెలిపారు.
పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా జగన్ సహించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. పెట్టుబడులు తీసుకురావడాన్ని కూడా ఓర్వలేకపోయారని, 2014 నుంచి 2019 మధ్య వచ్చిన పెట్టుబడులను పద్ధతిగా తరిమేశారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై శాసనసభలో, మండలిలో ఎన్నోసార్లు నచ్చజెప్పామని గుర్తు చేశారు.
అయితే తమ మాటలను పట్టించుకోకుండా పెట్టుబడిదారుల్లో భయం కలిగించేలా వ్యవహరించారని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారులకు భరోసా వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకెళ్తారని చెప్పారు. వైసీపీకి, జగన్కు మరో అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం ఇక జగన్కు సాధ్యం కాదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో…
సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే… ఈ తరహా మాటలే వినిపిస్తాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆ సినీ నటులు ఏకంగా…
సరిగ్గా మూడో వారంలో అడుగు పెట్టిన సందర్భంలో పెద్దికి కొత్త సీన్లు జోడించారు. కొన్ని హైదరాబాద్ సింగల్ స్క్రీన్లలో నిన్న…
మన శంకరవరప్రసాద్ గారుతో 2026 తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆరు నెలలు గ్యాప్ తీసుకుని…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను…
సెలబ్రెటీల్లో అయినా.. సామాన్యుల్లో అయినా..ఒకసారి విడాకులు అయ్యాక తమ మాజీ భాగస్వాములతో కలవడానికి అంతగా ఇష్టపడరు. వారి గురించి మాట్లాడడానికి…