Political News

వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!

2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఈసారి ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పేందుకు తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ప్రజలను నిరంతరం కలుసుకుని జగన్ మాయ మాటలను విడమర్చి చెబుతారని, తద్వారా వైసీపీకి మరో అవకాశం దక్కకుండా చూస్తామని అచ్చెన్న అన్నారు. మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పారు. వాటిని వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించిందని తెలిపారు.

పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా జగన్ సహించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. పెట్టుబడులు తీసుకురావడాన్ని కూడా ఓర్వలేకపోయారని, 2014 నుంచి 2019 మధ్య వచ్చిన పెట్టుబడులను పద్ధతిగా తరిమేశారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై శాసనసభలో, మండలిలో ఎన్నోసార్లు నచ్చజెప్పామని గుర్తు చేశారు.

అయితే తమ మాటలను పట్టించుకోకుండా పెట్టుబడిదారుల్లో భయం కలిగించేలా వ్యవహరించారని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారులకు భరోసా వచ్చిందని చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకెళ్తారని చెప్పారు. వైసీపీకి, జగన్‌కు మరో అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం ఇక జగన్‌కు సాధ్యం కాదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.

This post was last modified on May 28, 2026 10:20 pm

Share

Recent Posts

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

5 minutes ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

43 minutes ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

1 hour ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

1 hour ago

విశ్వదాభిరామా… వినవయ్యా విశ్వంభరా

చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…

1 hour ago

ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…

1 hour ago