కొన్ని ఆన్ స్క్రీన్ కాంబినేషన్లు చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటారు కానీ అవి అరుదుగా జరుగుతాయి. జైలర్ రూపంలో అది కొంత మేర తీరింది కానీ పూర్తి స్థాయిలో కాదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జట్టు కట్టించడం ద్వారా రాజమౌళి ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపించినా అలాంటి కథలు రాసేవాళ్ళు, తీసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కాంబోకి టాలీవుడ్ లో శ్రీకారం చుడుతున్నట్టు తాజాగా వినిపిస్తున్న సమాచారం.
బాలకృష్ణ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టుకి కార్యాచరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఉంటుందో లేదోననే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో, కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా సెట్స్ కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ కథలో రెండు పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయట. ముందు బాలయ్య డ్యూయల్ రోల్ అనుకుని ఇప్పుడు మరో సీనియర్ హీరోతో దాన్ని మార్చే విధంగా వివేక్ ఆత్రేయ మార్పులు చేశారని తెలిసింది.
ఇప్పుడా రెండో క్యారెక్టర్ కోసమే మోహన్ లాల్ ని ట్రై చేస్తున్నట్టు తెలిసింది. పాత్ర నచ్చితే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన వెనుకాడరు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చూశాం. మనమంతా సినిమాని కేవలం కంటెంట్ నచ్చి ఓకే చేశారు. తమిళంలో విజయ్ జిల్లాని ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. సో సరైన రీతిలో కన్విన్స్ చేయగలిగితే లాలెట్టన్ ని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ దిశగానే వివేక్ ఆత్రేయ ట్రయిల్స్ లో ఉన్నారట.
అప్పుడెప్పుడో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన గాండీవం సినిమాలో మోహన్ లాల్ ఒక పాటలో చిన్న క్యామియో చేశారు. సందర్భం ప్రత్యేకంగా లేకపోయినా దర్శకుడు ప్రియదర్శన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఎస్ చెప్పారు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటే కనక రెండు సింహాల మధ్య ఆన్ స్క్రీన్ యుద్ధం చూసినట్టు ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.
This post was last modified on May 23, 2026 9:00 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…