కొన్ని ఆన్ స్క్రీన్ కాంబినేషన్లు చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటారు కానీ అవి అరుదుగా జరుగుతాయి. జైలర్ రూపంలో అది కొంత మేర తీరింది కానీ పూర్తి స్థాయిలో కాదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జట్టు కట్టించడం ద్వారా రాజమౌళి ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపించినా అలాంటి కథలు రాసేవాళ్ళు, తీసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కాంబోకి టాలీవుడ్ లో శ్రీకారం చుడుతున్నట్టు తాజాగా వినిపిస్తున్న సమాచారం.
బాలకృష్ణ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టుకి కార్యాచరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఉంటుందో లేదోననే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో, కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా సెట్స్ కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ కథలో రెండు పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయట. ముందు బాలయ్య డ్యూయల్ రోల్ అనుకుని ఇప్పుడు మరో సీనియర్ హీరోతో దాన్ని మార్చే విధంగా వివేక్ ఆత్రేయ మార్పులు చేశారని తెలిసింది.
ఇప్పుడా రెండో క్యారెక్టర్ కోసమే మోహన్ లాల్ ని ట్రై చేస్తున్నట్టు తెలిసింది. పాత్ర నచ్చితే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన వెనుకాడరు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చూశాం. మనమంతా సినిమాని కేవలం కంటెంట్ నచ్చి ఓకే చేశారు. తమిళంలో విజయ్ జిల్లాని ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. సో సరైన రీతిలో కన్విన్స్ చేయగలిగితే లాలెట్టన్ ని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ దిశగానే వివేక్ ఆత్రేయ ట్రయిల్స్ లో ఉన్నారట.
అప్పుడెప్పుడో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన గాండీవం సినిమాలో మోహన్ లాల్ ఒక పాటలో చిన్న క్యామియో చేశారు. సందర్భం ప్రత్యేకంగా లేకపోయినా దర్శకుడు ప్రియదర్శన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఎస్ చెప్పారు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటే కనక రెండు సింహాల మధ్య ఆన్ స్క్రీన్ యుద్ధం చూసినట్టు ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.
రేపు విడుదల కాబోతున్న నాగబంధంకు ఇవాళ హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. దీంతో పాటే రిలీజవుతున్న రావు బహదూర్…
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న…
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం…
ఆరు నెలల నుంచి నిర్మాత ఆఫీస్ లో సెన్సార్ చిక్కుల్లో మగ్గిపోతున్న జన నాయకుడు ఎట్టకేలకు సర్టిఫికెట్ దక్కించుకుందని చెన్నై…
2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య బాల రామయ్యకు భక్తులు సమర్పించిన కానుకల దోపిడీ వ్యవహారంలో కీలక విషయం వెలుగు చూసింది.…