పెద్ది ప్రమోషన్స్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో జరిగిన ఈవెంట్ లో సాంగ్ లాంచ్ తో పాటు ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ జరిగింది. చెప్పిన టైం కన్నా రెండు మూడు గంటలు ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టినప్పటికీ భారీగా వచ్చిన ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూడటం గమనార్హం. లక్షకు పైగా కెపాసిటీ ఉన్న గ్రౌండ్ దాదాపుగా ఫుల్ అయిపోయింది. ఒక నాన్ హిందీ హీరో నటించిన సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం అరుదని చెప్పాలి.
ఊహించినట్టే స్టేజి మీద రెహమాన్ అదరగొట్టేశారు. తను కంపోజ్ చేసిన పాటలను హిందీ పల్లవితో మొదలుపెట్టి తెలుగు చరణాలతో ముగించడం బాగా పేలింది. ఐటెం సాంగ్ లైవ్ లోనే ఆకట్టుకునేలా ఉండటంతో లిరికల్ రూపంలో ఇయర్ ఫోన్ తో వింటే చార్ట్ బస్టర్ ఖాయమనేలా ఉంది. హైలైట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ భోపాల్ ప్రజలను ఉద్దేశించి బీహార్ అనడం, క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ బుమ్రాని ఫుట్ బల్ ప్లేయర్ అన్నట్టు రిపీట్ చేయడం నవ్వులు పూయించింది.
రవికిషన్ పెద్ది గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని, చరణ్ కు జాతీయ అవార్డులు ఖాయమని చెప్పేశారు. జాన్వీ కపూర్, నిర్మాత వెంకట సతీష్ కిలారు తదితరులు కంటెంట్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. ముంబై ట్రైలర్ లాంచ్ లో యాంకరే ఇక్కడా వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి జోష్ తీసుకొచ్చారు. సుమారు నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్వహించిన ఈ వేడుక కోరుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యింది
రెహమాన్ ప్రసంగంలో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కష్టపడిన విధానం, డాన్సుల రూపంలో తన సాంగ్స్ కి వేల్యూ జోడించడం ఇవన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. ఆద్యంతం జోష్ ఫుల్ గా జరిగిన వేడుకలో ఇంకొందరు క్యాస్టింగ్ రాలేదు కానీ హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ లో వాళ్ళను కలుసుకోవచ్చు. మొత్తానికి ఊహించిన దానికన్నా చాలా పెద్ద క్రౌడ్ భోపాల్ లో కనిపించడం మెగా ఫ్యాన్స్ ని ఆనందలో ముంచెత్తింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తయ్యింది.
This post was last modified on May 24, 2026 9:47 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…