ఇటీవలే విడుదలైన వీరభద్రుడు / కరుప్పు ఊహించని వీకెండ్ నమోదు చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూటా పాతిక కోట్ల దాకా గ్రాస్ వసూలైనట్టు సమాచారం. సూర్య గత పదమూడు సంవత్సరాల్లో ఈ నెంబర్ చూడలేదు. సింగం 2 తర్వాత ఇంత పెద్ద సక్సెస్ లేకపోవడమే దీనికి కారణం. తమిళనాడులో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తెలుగు వెర్షన్ సైతం తొంబై వేలు దాటడం విశేషం. ఇవి పెద్ద నెంబర్లు.
నిజానికి వీరభద్రుడుకి యునానిమస్ టాక్ రాలేదు. మిక్స్డ్, నెగటివ్, పాజిటివ్ అన్నీ వినిపించాయి. అయితే చాలా కాలం తెలుగు తమిళ బాక్సాఫీస్ కు సరైన మాస్ సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు. దీంతో అందరూ ఆకలి మీద ఉన్న తరహాలో వీరభద్రుడుకి వెళ్లిపోయారు. అందులోనూ తమిళ పేరుని పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా శుభ్రంగా తెలుగు దేవుడి పేరు టైటిల్ గా పెట్టడం బిసి సెంటర్స్ లో చాలా ప్లస్ అయ్యిందని బయ్యర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ రోజు నుంచి కరుప్పు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది కీలకంగా మారింది. ఒరిజినల్ వెర్షన్ కు ఢోకా లేదు. అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఏపీ తెలంగాణ ప్రేక్షకులకు ఇది తప్ప మరో మాస్ ఆప్షన్ లేకపోవడం కలిసి వచ్చింది. రెండో వారంలో ఉన్న గోదారి గట్టుపైన ఒక వర్గానికే పరిమితం కావడంతో మాస్ జనాలు సూర్యకే ఓటు వేశారు. ఇది శివ కార్తికేయన్ లాంటి హీరో చేసుంటే ఏమయ్యేదో కానీ సూర్య ఇమేజ్ పెద్ద రక్షణ కవచమైన మాట వాస్తవం.
అలాని సూర్య సినిమాలన్నీ ఇలాగే వర్కౌట్ అవుతాయని కాదు. తన మీద మినిమమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఏ కథ అయినా కాసులు కురిపిస్తుందని సూర్య ప్రూవ్ చేశాడు. దీన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన వాళ్ళు రెట్రో, కంగువ లాంటి డిజాస్టర్లు ఇచ్చారు. ఆర్జె బాలాజీ దర్శకత్వం కన్నా సూర్య యాక్టింగ్, క్లైమాక్స్ లో విశ్వరూపం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టే సూర్యకు దక్షిణాది మూడు భాషల్లో బలమైన ఫాలోయింగ్ ఉందని అర్థమవుతోంది. వాడుకోవడం డైరెక్టర్ల చేతిలో ఉంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…