ఇటీవలే విడుదలైన వీరభద్రుడు / కరుప్పు ఊహించని వీకెండ్ నమోదు చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూటా పాతిక కోట్ల దాకా గ్రాస్ వసూలైనట్టు సమాచారం. సూర్య గత పదమూడు సంవత్సరాల్లో ఈ నెంబర్ చూడలేదు. సింగం 2 తర్వాత ఇంత పెద్ద సక్సెస్ లేకపోవడమే దీనికి కారణం. తమిళనాడులో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తెలుగు వెర్షన్ సైతం తొంబై వేలు దాటడం విశేషం. ఇవి పెద్ద నెంబర్లు.
నిజానికి వీరభద్రుడుకి యునానిమస్ టాక్ రాలేదు. మిక్స్డ్, నెగటివ్, పాజిటివ్ అన్నీ వినిపించాయి. అయితే చాలా కాలం తెలుగు తమిళ బాక్సాఫీస్ కు సరైన మాస్ సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు. దీంతో అందరూ ఆకలి మీద ఉన్న తరహాలో వీరభద్రుడుకి వెళ్లిపోయారు. అందులోనూ తమిళ పేరుని పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా శుభ్రంగా తెలుగు దేవుడి పేరు టైటిల్ గా పెట్టడం బిసి సెంటర్స్ లో చాలా ప్లస్ అయ్యిందని బయ్యర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ రోజు నుంచి కరుప్పు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది కీలకంగా మారింది. ఒరిజినల్ వెర్షన్ కు ఢోకా లేదు. అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఏపీ తెలంగాణ ప్రేక్షకులకు ఇది తప్ప మరో మాస్ ఆప్షన్ లేకపోవడం కలిసి వచ్చింది. రెండో వారంలో ఉన్న గోదారి గట్టుపైన ఒక వర్గానికే పరిమితం కావడంతో మాస్ జనాలు సూర్యకే ఓటు వేశారు. ఇది శివ కార్తికేయన్ లాంటి హీరో చేసుంటే ఏమయ్యేదో కానీ సూర్య ఇమేజ్ పెద్ద రక్షణ కవచమైన మాట వాస్తవం.
అలాని సూర్య సినిమాలన్నీ ఇలాగే వర్కౌట్ అవుతాయని కాదు. తన మీద మినిమమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఏ కథ అయినా కాసులు కురిపిస్తుందని సూర్య ప్రూవ్ చేశాడు. దీన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన వాళ్ళు రెట్రో, కంగువ లాంటి డిజాస్టర్లు ఇచ్చారు. ఆర్జె బాలాజీ దర్శకత్వం కన్నా సూర్య యాక్టింగ్, క్లైమాక్స్ లో విశ్వరూపం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టే సూర్యకు దక్షిణాది మూడు భాషల్లో బలమైన ఫాలోయింగ్ ఉందని అర్థమవుతోంది. వాడుకోవడం డైరెక్టర్ల చేతిలో ఉంది.
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…