టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్ పోతినేని దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తనే హీరోగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్.. వీర అనే పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో దర్శకత్వం నుంచి నటన వైపు వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. హీరోలు దర్శకులవ్వడం మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతోంది.
ఇప్పుడున్న హీరోల్లో రామ్ కంటే ముందు ఈ సాహసం చేసింది విశ్వక్సేన్ మాత్రమే. అతను కెరీర్ ఆరంభంలోనే ఫలక్నుమా దాస్ తీశాడు. తర్వాత ధమ్కీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కల్ట్ అనే సినిమా తీస్తున్నాడు. అడివి శేష్ ఒకేసారి దర్శకుడిగా, హీరోగా పరిచయం అయ్యాడు. కర్మ సినిమా తీశాడు. తర్వాత తనే హీరోగా కిస్ అనే సినిమా తీశాడు. ఐతే ముందు హీరోగా పరిచయం అయి.. తర్వాత దర్శకుడిగా మారిన జాబితాలో అతనుండడు.
ఇక ముందు తరంలో దర్శకత్వం చేపట్టిన స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆయన జానీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. తర్వాత సత్యాగ్రహి అనే మరో సినిమా కూడా తీయాలనుకున్నాడుడ కానీ.. కుదరలేదు. పవన్ కంటే ముందు తరంలో లెజెండరీ నటులు ఎన్టీ రామారావు, కృష్ణలిద్దరూ దర్శకత్వం చేపట్టారు.
ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సహా పది సినిమాలకు పైగానే తీశారు. అందులో అయిదు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ సైతం దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన ఖాతాలో సింహాసనం లాంటి బ్లాక్ బస్టర్ ఉంది.
ఇలా టాలీవుడ్లో దర్శకత్వం వైపు అడుగులు వేసిన హీరోల సంఖ్య చాలా తక్కువే. హీరోయిన్లలో భానుమతి రామకృష్ణ, విజయ నిర్మల తదితరులు దర్శకులుగా మంచి స్థాయిని అందుకున్నారు. ఇక హీరోలు కాకుండా నటన నుంచి దర్శకులైన వాళ్ల జాబితా పెద్దదే. రవిబాబు, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఈ జాబితాలో కనిపిస్తారు.
This post was last modified on May 16, 2026 3:08 pm
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…
ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. మూడు నిమిషాల…