టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్ పోతినేని దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తనే హీరోగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్.. వీర అనే పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో దర్శకత్వం నుంచి నటన వైపు వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. హీరోలు దర్శకులవ్వడం మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతోంది.
ఇప్పుడున్న హీరోల్లో రామ్ కంటే ముందు ఈ సాహసం చేసింది విశ్వక్సేన్ మాత్రమే. అతను కెరీర్ ఆరంభంలోనే ఫలక్నుమా దాస్ తీశాడు. తర్వాత ధమ్కీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కల్ట్ అనే సినిమా తీస్తున్నాడు. అడివి శేష్ ఒకేసారి దర్శకుడిగా, హీరోగా పరిచయం అయ్యాడు. కర్మ సినిమా తీశాడు. తర్వాత తనే హీరోగా కిస్ అనే సినిమా తీశాడు. ఐతే ముందు హీరోగా పరిచయం అయి.. తర్వాత దర్శకుడిగా మారిన జాబితాలో అతనుండడు.
ఇక ముందు తరంలో దర్శకత్వం చేపట్టిన స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆయన జానీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. తర్వాత సత్యాగ్రహి అనే మరో సినిమా కూడా తీయాలనుకున్నాడుడ కానీ.. కుదరలేదు. పవన్ కంటే ముందు తరంలో లెజెండరీ నటులు ఎన్టీ రామారావు, కృష్ణలిద్దరూ దర్శకత్వం చేపట్టారు.
ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సహా పది సినిమాలకు పైగానే తీశారు. అందులో అయిదు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ సైతం దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన ఖాతాలో సింహాసనం లాంటి బ్లాక్ బస్టర్ ఉంది.
ఇలా టాలీవుడ్లో దర్శకత్వం వైపు అడుగులు వేసిన హీరోల సంఖ్య చాలా తక్కువే. హీరోయిన్లలో భానుమతి రామకృష్ణ, విజయ నిర్మల తదితరులు దర్శకులుగా మంచి స్థాయిని అందుకున్నారు. ఇక హీరోలు కాకుండా నటన నుంచి దర్శకులైన వాళ్ల జాబితా పెద్దదే. రవిబాబు, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఈ జాబితాలో కనిపిస్తారు.
This post was last modified on May 16, 2026 3:08 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…