ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ బహీరాబాద్ పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు భగీరథ్ కు నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని వాదించిన భగీరథ్, ఆయన కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పలు వివరాలను న్యాయవాదుల ఎదుట పెట్టి కేసును సమగ్రంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసు విచారణకు హాజరయ్యే విషయంలో భగీరథ్ ఒకింత జాప్యం చేశారు.
అయితే కేసు తీవ్రమైనదైనా పోలీసుల విచారణకు భగీరథ్ హాజరు కాని నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్టుగా పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా పోలీసుల నోటీసుల గడువు ముగిసి వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో భగీరథ్ శనివారం రాత్రి లొంగిపోయారు.
ఈ సందర్భంగా ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భగీరథ్ ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయమర్తి ఎదుట హాజరుపరిచారు.
This post was last modified on May 17, 2026 8:33 am
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…