Movie News

21 ఇండస్ట్రీ ప్రతినిధులు… తీరిపోవాలి సమస్యలు

ఇండస్ట్రీని గత నాలుగైదు రోజులుగా కుదిపేస్తున్న సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం మూవీ లవర్స్ లో సంతోషాన్ని నింపుతోంది. ముఖ్యంగా పెద్దికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండలి తరఫున దిల్ రాజు హామీ ఇచ్చేయడంతో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. లేకపోతే హైదరాబాద్ లో సరైన షోలు పడక తీవ్ర నష్టంతో పాటు అభిమానులు బాగా హర్టయ్యేవాళ్ళు. ఏదైతేనేం ప్రస్తుతానికి టెన్షన్ అక్కర్లేదు.

వీలైనంత త్వరగా ఈ పర్సెంటేజ్ వివాదం కొలిక్కి తెచ్చెదుకు ఫిలిం ఛాంబర్ మొత్తం 21 సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. నిర్మాతల వైపు నుంచి సురేందర్ రెడ్డి, సుప్రియ, రవిశంకర్, బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్కెఎన్, ప్రసన్న కుమార్ ఇందులో ఉంటారు. ఎగ్జిబిటర్ల తరఫున ప్రతాప్ రెడ్డి, బాల్ గోవింద్ రాజ్, అనుపమ్ రెడ్డి, శ్రీనివాసరావు, వీర నారాయణబాబు, వంశీ కిషోర్, విజందర్ రెడ్డి భాగం వహిస్తారు.

ఇక డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి విష్ణు మూర్తి, వీర్ నాయుడు, సుధాకర్ రెడ్డి, ముత్యాల రాందాస్, నాగార్జున ఎన్, మధుసూదన్ రెడ్డి, ధీరజ్ మొగిలినేని ప్రాతినిధ్యం తీసుకున్నారు. మొత్తం 21 సభ్యులు ఉన్న ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ని బట్టి ఈ గ్రూపులకు మార్గదర్శకత్వం వహిస్తున్న సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కెఎల్ నారాయణ, అశోక్ కుమార్ అందరితో కలిసి చర్చించి అభిప్రాయాలు తీసుకుని చివరి నిర్ణయాలు వెల్లడిస్తారు.

దీనికి నెల నుంచి రెండు నెలల దాకా గడువు పెట్టుకుని దానికి అనుగుణంగానే చర్చలు జరపబోతున్నట్టు తెలిసింది. సర్వసభ్య సమావేశంలో చిన్నపాటి గొడవలు రేగినా ఇకపై అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పైన చెప్పిన మెంబర్స్ కలిసికట్టుగా కృషి చేయబోతున్నారు. అప్పటిదాకా రిలీజయ్యే సినిమాలు పర్సెంటేజ్ స్లాబ్ లోకి రావు. జూన్ 4 పెద్ది విడుదలయ్యాక వరసగా మా ఇంటి బంగారం, సింగ్ గీతం, లెనిన్ లాంటి వరస రిలీజులు సందడి చేయబోతున్నాయి.

This post was last modified on May 15, 2026 9:13 pm

Share

Recent Posts

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

59 minutes ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

1 hour ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

1 hour ago

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

2 hours ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

2 hours ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

5 hours ago