మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్ తో పాటు టీజర్ విడుదల చేయబోతున్నారు. వీడియోలో తారక్ లుక్, కాన్సెప్ట్ హైలైట్ చేస్తారు తప్పించి కీలకమైన విజువల్స్ రివీల్ చేయరు. సలార్ కు పాటించిన స్ట్రాటజీనే నీల్ మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. డైనోసర్ అనే పదంతో ఎలా అయితే హైప్ అమాంతం పెంచాడో ఈసారి అంతకు మించిన లైన్స్ ఎంచుకున్నాడట.
ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇది లాంచ్ కానుంది. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఎలాగూ జూనియర్ బర్త్ డే కాబట్టి ఈ రూపంలో సంబరాలు చేయబోతున్నారు. అయితే హైప్ పరంగా చాలా బాగుంది కానీ అంతే మోతాదులో బరువు కూడా ఉన్న విషయాన్ని ఎన్టీఆర్ నీల్ మర్చిపోకూడదు. ఎందుకంటే వార్ 2 గాయం ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. అది మానాలంటే వాళ్లకు కనిపిస్తున్న మందు ప్రశాంత్ నీల్ ఒక్కటే.
సో ఎక్స్ ట్రాడినరి అనిపించేయాలి. అంతర్గత సమాచారం మేరకు విజువల్స్ చాలా బాగున్నాయట. ఇతర పాత్రలను రివీల్ చేయకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ నే ఫోకస్ చేసేలా నీల్ కట్ చేయించాడని అంటున్నారు. కాకపోతే మరీ విపరీతంగా ఊహించేసుకుంటే కాదు కానీ తాను ఏ స్థాయిలో యంగ్ టైగర్ ని ఆవిష్కరించిబోతున్నాడో ప్రశాంత్ నీల్ ఈ శాంపిల్ రూపంలో చూపించబోతున్నాడని తెలిసింది.
ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. ముందు రోజు పెద్ది ట్రైలర్ వచ్చి ఉంటుంది. అది కనక క్లిక్ అయితే సోషల్ మీడియా దాని హ్యాంగోవర్ లో మునుగుతుంది. దాన్ని డామినేట్ చేసేలా ఉందని నీల్ అనిపించుకోవాలి. సగం షూటింగ్ కూడా అవ్వని ఎన్టీఆర్ సినిమాతో పెద్దిని పోల్చడం కరెక్ట్ కాదు కానీ ఆన్ లైన్ జనాలకు ఆ పట్టింపులు ఏమీ ఉండవు. కంపారిజన్లతో వాయించేస్తారు. సో ఆ రెండు రోజులు ఎక్స్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో మంచి హంగామా చూడొచ్చు.
This post was last modified on May 15, 2026 2:58 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…