మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్ తో పాటు టీజర్ విడుదల చేయబోతున్నారు. వీడియోలో తారక్ లుక్, కాన్సెప్ట్ హైలైట్ చేస్తారు తప్పించి కీలకమైన విజువల్స్ రివీల్ చేయరు. సలార్ కు పాటించిన స్ట్రాటజీనే నీల్ మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. డైనోసర్ అనే పదంతో ఎలా అయితే హైప్ అమాంతం పెంచాడో ఈసారి అంతకు మించిన లైన్స్ ఎంచుకున్నాడట.
ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇది లాంచ్ కానుంది. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఎలాగూ జూనియర్ బర్త్ డే కాబట్టి ఈ రూపంలో సంబరాలు చేయబోతున్నారు. అయితే హైప్ పరంగా చాలా బాగుంది కానీ అంతే మోతాదులో బరువు కూడా ఉన్న విషయాన్ని ఎన్టీఆర్ నీల్ మర్చిపోకూడదు. ఎందుకంటే వార్ 2 గాయం ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. అది మానాలంటే వాళ్లకు కనిపిస్తున్న మందు ప్రశాంత్ నీల్ ఒక్కటే.
సో ఎక్స్ ట్రాడినరి అనిపించేయాలి. అంతర్గత సమాచారం మేరకు విజువల్స్ చాలా బాగున్నాయట. ఇతర పాత్రలను రివీల్ చేయకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ నే ఫోకస్ చేసేలా నీల్ కట్ చేయించాడని అంటున్నారు. కాకపోతే మరీ విపరీతంగా ఊహించేసుకుంటే కాదు కానీ తాను ఏ స్థాయిలో యంగ్ టైగర్ ని ఆవిష్కరించిబోతున్నాడో ప్రశాంత్ నీల్ ఈ శాంపిల్ రూపంలో చూపించబోతున్నాడని తెలిసింది.
ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. ముందు రోజు పెద్ది ట్రైలర్ వచ్చి ఉంటుంది. అది కనక క్లిక్ అయితే సోషల్ మీడియా దాని హ్యాంగోవర్ లో మునుగుతుంది. దాన్ని డామినేట్ చేసేలా ఉందని నీల్ అనిపించుకోవాలి. సగం షూటింగ్ కూడా అవ్వని ఎన్టీఆర్ సినిమాతో పెద్దిని పోల్చడం కరెక్ట్ కాదు కానీ ఆన్ లైన్ జనాలకు ఆ పట్టింపులు ఏమీ ఉండవు. కంపారిజన్లతో వాయించేస్తారు. సో ఆ రెండు రోజులు ఎక్స్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో మంచి హంగామా చూడొచ్చు.
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…