ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా చేస్తున్నారు. కొందరు సినిమాకు సంబంధించి ప్రతి దశలోనూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఐతే నేచురల్ స్టార్ నాని తన సినిమాల్లో రైటింగ్ సహా దేనికీ ఇప్పటిదాకా క్రెడిట్ తీసుకోలేదు కానీ.. అతను కథా చర్చల్లో తన వంతు పాత్ర పోషిస్తుంటాడని.. డైలాగులను ఆన్ సెట్ ఇంప్రొవైజ్ చేస్తుంటాడని తనతో కలిసి పని చేసిన వాళ్లు చెబుతుంటారు.
నాని కెరీర్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న ‘నిన్ను కోరి’ సినిమాకు సంబంధించి నానికి ఒక మేజర్ క్రెడిటే ఉందట. ఆ సినిమాకు టైటిల్ పెట్టిందే నానినట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ వెల్లడించాడు. ‘నిన్ను కోరి’ ఇటీవలే రీ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్లో కొత్త సినిమాలను మించి ఇది సందడి చేస్తోంది. థియేటర్లలో సంబరాలు గట్టిగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో ‘నిన్ను కోరి’ విశేషాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో పేర్లు పడేటపుడు వచ్చే టైటిల్ సాంగ్ను శివనే రాశాడు. ఇది ఎలా జరిగిందో వివరిస్తూ.. ‘నిన్ను కోరి’ టైటిల్ పెట్టింది నాని అని వెల్లడించాడు శివ.
ఇంకా టైటిల్ ఖరారు చేయని సమయంలో నాని ఒక రోజు ఫోన్ చేసి, నేనొక టైటిల్ చెప్తా, వెంటనే అదెలా ఉందో నువ్వు చెప్పాలి అన్నాడని.. అతను ‘నిన్ను కోరి’ అనే టైటిల్ చెప్పగానే అద్భుతంగా ఉంది, కథకు బాగా సూటవుతుంది అని చెప్పి దాన్నే ఫైనలైజ్ చేశానని చెప్పాడు శివ.
ఇక టైటిల్స్ పడేటపుడు ‘నిన్ను కోరి’ అంటూ ఒక చిన్న బిట్ సాంగ్ వస్తే బాగుంటుందని రీ రికార్డింగ్ చేసేటపుడు సంగీత దర్శకుడు గోపి సుందర్కు చెబితే, మరి లిరిక్స్ ఎలా అని అడిగాడని.. అప్పటికప్పుడు తాను పావు గంటలో నాలుగైదు లైన్లు రాసి ఇచ్చానని.. వాటితోనే గోపి బ్యూటిఫుల్ సాంగ్ చేశాడని శివ నిర్వాణ వెల్లడించాడు.
2017లో వచ్చిన ‘నిన్ను కోరి’ అప్పట్లో మంచి విజయం సాధించడమే కాక.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. శివ ప్రస్తుతం రవితేజతో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…