ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై వర్గాల్లో బలంగా జరిగింది. విజయ్ సిఎం కావడం మీద రాజకీయ, జన, మీడియా వర్గాలన్నీ దృష్టి పెట్టడంతో సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫ్లాప్ అయినా సరే ధనుష్ కర ఈ కారణంగానే వసూళ్ళలో పెద్ద కోత చూడాల్సి వచ్చింది. నిన్న మూడోసారి విజయ్ గవర్నర్ ను కలిశాక ఇక అంతా సద్దుమణిగిందని భావించారు.
అందుకే వీరభద్రుడు (కరుప్పు) నిర్మాతలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఎలాగూ విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి ఇంక టెన్షన్ లేదనుకుని మే 14 మరోసారి కన్ఫర్మ్ చేశారు. థియేటర్ అగ్రిమెంట్లు, బెనిఫిట్ షో బుకింగ్స్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ముందస్తుగా రెడీ అవుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే విజయ్ పార్టీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గంట గంట మలుపులు తిరుగుతూ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. కథ మళ్ళీ మొదటికే వచ్చింది.
ఈ నేపథ్యంలో వీరభద్రుడు మీద ఆశించిన బజ్ రావడం లేదని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు పోస్ట్ పోన్లలో నలిగిపోయింది. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ కం యాక్షన్ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేశాడు. లాయర్, దేవుడుగా రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ కొత్తగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. అల్లు అర్జున్ రాకాకు పని చేస్తున్న సాయి అభ్యంన్కర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా యూనిట్ చెబుతోంది.
తమిళ సంగతి ఏమో కానీ తెలుగులో దీనికి మంచి ప్రమోషన్స్ చేసుకుంటే మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో నటించిన కమర్షియల్ సినిమా వచ్చి నెలలు అవుతోంది. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినా అది తీవ్రంగా నిరాశ పరిచింది. ఎలాగూ టాలీవుడ్ జనాలకు భాషాభేదం ఉండదు కాబట్టి వీరభద్రుడులో మినిమమ్ కంటెంట్ ఉన్నా చాలు హిట్ ఇచ్చేస్తారు. ఇందులో త్రిష హీరోయిన్ కావడం ఇప్పుడో ఆకర్షణగా మారిపోయింది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…