Political News

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం.చేశారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కాంగ్రెస్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సువేందు అధికారి .. తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి, అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సువేందు అధికారి కుటుంబానికి కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లో గుర్తింపు పొందగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ నేతగా ప్రభావం చూపారు. ఆ రాజకీయ వారసత్వంతోనే సువేందు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.

తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సువేందు అధికారి, పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నందిగ్రామ్ ఉద్యమం సమయంలో ఆయన ప్రభావం మరింత పెరిగింది. మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన, రవాణా మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ బలోపేతానికి కృషి చేసిన నేతల్లో సువేందు ఒకరిగా గుర్తింపు పొందారు.

అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తితో సువేందు అధికారి టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయనకు జైంట్ కిల్లర్గా రాజకీయ గుర్తింపు వచ్చింది.

ఇప్పటికే బెంగాల్‌లో బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా మారిన సువేందు అధికారిని సీఎం అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. ఇదే సమయంలో 2016లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సువేందు అధికారి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని విమర్శించిన మోదీ.. ఇప్పుడు అదే నేతను సీఎం అభ్యర్థిగా నిలబెట్టడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

This post was last modified on May 9, 2026 12:42 pm

Share

Recent Posts

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

47 minutes ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

1 hour ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

2 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

4 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

6 hours ago

అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…

6 hours ago