ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడమే అందుక్కారణం. ఐతే సాధారణంగా ప్రశాంత్ వేగంగానే సినిమాలు తీస్తాడు కానీ డ్రాగన్ బాగా ఆలస్యం అవుతోంది.
సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లవుతోంది. షూట్ ఏడాది ముందే మొదలైంది. ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ కొంత ఆలస్యం అవుతుండడంతో ఈ ఏడాది చివరికైనా రిలీజైతే చాలు అనుకున్నారు ఫాన్స్. కానీ డ్రాగన్ అనూహ్యంగా 2027 జూన్కు వాయిదా పడిపోయింది.
దీంతో తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ రోజుల్లో అన్ని పెద్ద సినిమాలూ వాయిదా పడడం కామన్ అయిపోయినా మరీ ప్రశాంత్ సైతం ఇంత లేట్ చెయ్యడం ఏంటి అని వారు అసహనానికి గురవుతున్నారు.
ఐతే మధ్యలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కథను మార్చడమే ఈ ఆలస్యానికి కారణం అని వెల్లడైంది. డ్రాగన్ ప్రొడక్షన్ టీంలో ఒకరైన చెర్రీ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన జెట్లీ ప్రమోషన్లలో భాగంగా డ్రాగన్ గురించి మాట్లాడారు.
గత ఏడాది విడుదలైన తారక్ బాలీవుడ్ మూవీ వార్-2 సరిగా ఆడని నేపథ్యంలో డ్రాగన్ కథలో ప్రశాంత్ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు చెర్రీ వెల్లడించాడు. ఈ కారణంగా డ్రాగన్ షూట్ కొంత కాలం ఆగినట్లు కూడా ఆయన చెప్పాడు. ఐతే షూట్ విషయంలో ప్రశాంత్ చాలా స్పీడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే అని.. ఇప్పుడు షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం వేగంగా సాగిపోతున్నాయి.. వచ్చే ఏడాది చెప్పిన డేటుకే సినిమా వస్తుందని చెర్రీ ధీమా వ్యక్తంచేశాడు.
మరోవైపు ప్రభాస్ సినిమా ఫౌజీ షూట్ 80 వాతం దాకా పూర్తయిందని.. మూడు యాక్షన్ సీక్వెన్సులు, కొంచెం టాకీ పార్ట్ మాత్రమే మిగిలుందని చెర్రీ వెల్లడించాడు. ప్రభాస్ టాకీ పార్ట్ అయిపోయిందని.. యాక్షన్ పార్ట్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందని చెప్పాడు చెర్రీ.
This post was last modified on May 1, 2026 8:36 am
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…