మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఈ ఫ్రాంచైజ్ కు చెందిన డిజిటల్ హక్కులు తమకే చెందుతాయని, ఈ డీల్ సెటిల్ అయ్యేవరకు విడుదల ఆపాల్సిందిగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పెన్ స్టూడియోస్ రంగప్రవేశం చేయడం, రిలీజ్ కు అనుకూలంగా పరిణామాలు జరిగిపోవడం చకచకా జరిగాయి.
నిజానికి దృశ్యం ఏప్రిల్ లోనే రావాల్సింది. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల దుబాయ్ లో విడుదల చేయలేమని గుర్తించి వాయిదా వేసుకున్నారు. ఈలోగా ఏవేవో జరిగిపోయాయి. క్రేజ్ ఉంది క్యాష్ చేసుకుందామని ఆ మధ్య దృశ్యం 2ని థియేటర్స్ లో మళ్ళీ విడుదల చేస్తే మోహన్ లాల్ అభిమానులే పట్టించుకోక పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఓటిటిలో డైరెక్ట్ రిలీజై అరిగిపోయిన సినిమా మీద డబ్బులు చేసుకుందామని వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టింది.
ఇప్పుడీ దృశ్యం 3 తెలుగు డబ్బింగ్ ఉంటుందో లేదో వీలైనంత త్వరగా క్లారిటీ రావాలి. ఎందుకంటే వెంటనే రీమేక్ చేసేందుకు వెంకటేష్ అందుబాటులో లేరు. ఆదర్శ కుటుంబం అయిపోగానే అనిల్ రావిపూడి షూటింగ్ లో అడుగు పెట్టాలి. సో ఈ ఏడాది మొత్తం లాకైపోయినట్టే. ఒకవేళ తర్వాత చేద్దామా అంటే ఒరిజినల్ దృశ్యం 3 తాలూకు స్పాయిలర్స్, లీక్స్ అన్నీ సోషల్ మీడియాలో వచ్చేసి ఉంటాయి కాబట్టి కంటెంట్ మీద ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది.
అటు హిందీలో అజయ్ దేవగన్ పూర్తిగా వేరే కథతో దృశ్యం 3 తీస్తున్నారు. అక్టోబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్ని భాషల్లో ఇది చివరి భాగం. ఇకపై హీరో పాత్ర శవాన్ని ఏం చేస్తుందనే సస్పెన్స్ ఉండదు. దర్శకుడు జీతూ జోసెఫ్ దానికో అర్థవంతమైన ముగింపు ఇచ్చినట్టు కేరళ మీడియా టాక్. ఈసారి థ్రిల్స్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశారని, అంచనాలు అతిగా పెట్టుకోకుండా గొప్ప అనుభూతి ఇస్తుందని పని చేసిన వాళ్ళు చెబుతున్నారు.
This post was last modified on April 26, 2026 7:48 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…