Political News

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. అస‌లు ఏం స్పందించాలి? ఎలా స్పందించాలి? అనే విష‌యంపై వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇత‌ర విష‌యాలు.. మ‌రేత‌ర విమ‌ర్శ‌లు చేసినా స్పందించాల్సిన‌ అవ‌స‌రం ఉండేది కాదు. కానీ.. నేరుగానే కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం.. మారిన మ‌నిషి-మ‌ర మ‌నిషి అని క‌విత వ్యాఖ్యానించడం పై స‌మాజంలో చ‌ర్చ సాగుతోంది.

దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌న్న‌ది బీఆర్ ఎస్ పార్టీలోని సీనియ‌ర్లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కానీ.. ఎందుకో ఎవ‌రూ స్పందించ‌లేదు. శ‌నివారం పార్టీ స్థాపించిన‌ట్టు ప్ర‌క‌టించిన క‌విత‌.. ఆదివారం మీడియా ముందుకు రావొచ్చ‌ని స‌మాచారం వ‌చ్చినా.. ఆమె కూడా మౌనంగా ఉన్నారు.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ ఎస్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోవ‌డం.. ఊహించ‌ని విధంగా బీజేపీ, కాంగ్రెస్‌లు.. త‌న పార్టీని స్వాగ‌తించ‌డం వంటివి క‌నిపించాయి. అయినా.. క‌విత మీడియా ముందుకు వ‌స్తార‌ని.. ఆదివారం పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

ఇదిలావుంటే.. క‌విత వ్య‌వ‌హారంపై స్పందించ‌క‌పోతే.. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీ ఏర్పాటును బీఆర్ ఎస్ స్వాగ‌తించే పరిస్థితిలో లేద‌న్న వాద‌నను తెర‌మీదికి తెచ్చేందుకు ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఏ పార్టీకి ఆ పార్టీ ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటుంది. కానీ, మాజీ సీఎం కుమార్తె నేరుగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు దానిపై కూడా బీఆర్ ఎస్ మౌనంగా ఉండ‌డం.. ఎవ‌రూ స్పందించ‌క పోవ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.

రెండు కార‌ణాలు..

క‌విత పార్టీ విష‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కులు స్పందించ‌క పోవ‌డంపై ప‌రిశీల‌కులు, విశ్లేష‌కులు రెండు రీజ‌న్లు చెబుతున్నారు. 1) తాము స్పందిస్తే.. మ‌రింత ఎటాక్ పెరుగుతుంద‌న్న ఉద్దేశం: రాజ‌కీయాల్లో స‌హ‌జంగానే మాట‌కు మాట ఎదురొస్తుంది. క‌విత ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువ‌గానే చ‌దివింది. సో.. అందుకే బీఆర్ ఎస్ మౌనంగా ఉంద‌ని భావిస్తున్నారు.

2) కేసీఆర్ ఉద్దేశ పూర్వ‌క మౌనంతో క‌విత‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయాల‌న్న వ్యూహం ఉంద‌ని అంటున్నారు. త‌ద్వారా ఆమె ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా స్పందించ‌కుండా ఉంటే.. తెలంగాణ స‌మాజ‌మే ఆమెకు స‌మాధానం చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

This post was last modified on April 26, 2026 8:20 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

22 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

37 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

37 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago