ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల విషయంలో చూపిస్తున్న అలసత్వం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. రేపో ఎల్లుండో ధనుష్ వచ్చి ఈవెంట్ చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు అది సరిపోదు. ఇంకేదో సౌండ్ చేయాలి. ఇడ్లి కొట్టు, రాయన్ లాంటివి మన దగ్గర దారుణంగా ఫెయిలవ్వడంతో ఇక్కడ మార్కెట్ ధనుష్ లైట్ తీసుకున్నారేమో బహుశా.
సరే బజ్ సంగతి పక్కనపెడితే కరలో మన స్టువర్ట్ పురం ఛాయలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో దొంగల ఊరిగా బాగా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ ఊరి మీద యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాస్తే ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లో నటించారు. అది డిజాస్టరయ్యింది. అదే టైంలో స్టువర్ట్ పురం దొంగలు అనే మరో భాను చందర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది. ఇది 1991 నాటి ముచ్చట.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు బ్యాక్ డ్రాప్ కూడా దీని ఆధారంగా తీసుకున్నదే. అయితే ఇది పీరియాడిక్ బయోపిక్. కరలో మెయిన్ పాయింట్ స్టువర్ట్ పురం నేపధ్యానికి దగ్గరగా ఉంటుందని, దొంగతనాలకు అలవాటు పడిన ఒక యువకుడి జీవితం సామజిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఎలాంటి మలుపులు తీసుకుందనే పాయింట్ మీద దీన్ని రూపొందించారట. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది తప్పుకోవడంతో కరకు ఇతర రాష్ట్రాల్లో బెనిఫిట్ కానుంది.
ఫలితం మీద ధనుష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన దగ్గరే కాదు తమిళనాడులోనూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. జనవరిలో జన నాయకుడు వాయిదా పడ్డాక అంత ఊపు ఇచ్చే సినిమాలు పెద్దగా రాలేదు. రాధికా తాయ్ కిళవి లాంటివి కొంత ఊరట కలిగించాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కర కనక సక్సెస్ అయితే థియేటర్లకు ఆక్సిజన్ దొరుకుతుందని బయ్యర్లు ఆశపడుతున్నారు. తమిళ నేటివిటీ నిండిన కరని మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on April 26, 2026 9:25 am
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…