తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే అతను దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఇక తన తొలి హీరో పవన్ కళ్యాణ్ అంటే కరుణాకరన్కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘తొలి ప్రేమ’తో పవన్ కెరీర్ను కూడా మలుపు తిప్పినప్పటికీ.. పవన్ తనకు అవకాశం ఇవ్వడమే గొప్ప అంటాడు కరుణాకరన్. ‘తొలి ప్రేమ’ తర్వాత కరుణాకరన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా ఇప్పుడు రీ రిలీజై మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లోనూ పవన్ మీద తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నాడు కరుణాకరన్.
ఈ సందర్భంగా పవన్తో కరుణాకరన్ అనుబంధాన్ని, పవన్ మీద కరుణాకరన్ ఫ్యానిజాన్ని చాటే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘డార్లింగ్’ రిలీజ్ టైంలో ఒక టీవీ షోలో పాల్గొన్న కరుణాకరన్.. ఆ చిత్ర కథానాయిక కాజల్ అగర్వాల్తో కలిసి ఒక గేమ్ ఆడారు.
హీరోల ముఖంలో చిన్న పార్ట్ చూపించి అతనెవరో కనుక్కోవడం ఆ గేమ్లో భాగం. అందులో జస్ట్ పవన్ గడ్డాన్ని చూపిస్తే అది పవన్ కళ్యాణ్ అని కనిపెట్టేశాడు కరుణాకరన్. దీంతో ఇదేం ఫ్యానిజం బాబోయ్ అంటూ యాంకర్ ఉదయభాను షాకైంది.
పవన్కు సంబంధించి ఏ చిన్న విషయమైనా తాను కనిపెట్టేస్తానని.. ఆయనంటే తనకు అంతిష్టమని.. తనకు ఆయన దేవుడు ఇచ్చిన అన్నయ్య అని కరుణాకరన్ వ్యాఖ్యానించాడు అప్పట్లో.
దర్శకుడిగా తనకు తొలి అవకాశం ఇచ్చినందుకు ఇన్నేళ్ల తర్వాత కూడా కరుణాకరన్.. పవన్ మీద అంతే అభిమానం చూపిస్తూ ఉంటాడు. కరుణాకరన్ ఇటీవలే బెల్లంకొండ గణేష్ హీరోగా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ మాటలు అందిస్తుండడం విశేషం.
This post was last modified on April 25, 2026 6:30 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర…
ఈ ఏడాది భారీ అంచనాలు మోస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ చాలా కీలకం. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే…
బాలీవుడ్ నటులు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమి కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. కాకపోతే వాళ్ళు ప్రమోషన్లలో అంతగా కనిపించరు.…
మార్చి నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ ఎదురు చూసిన మెగాస్టార్ 158 ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. ఏపీ డిప్యూటీ సిఎం…
వైసీపీ హయాంలో పథకాలను అమలు చేశారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. 2.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచారు.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, హుందాతనం ఉన్నాయి. పూసపాటి రాజుల రాజకీయ వారసత్వం ఎప్పుడూ ఒక…