ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో అతిథిగా రావడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. కానీ ఏ హీరో సినిమాకు ఏ హీరో వచ్చాడు అన్నదాన్ని బట్టి అభిమానుల స్పందన ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని అనధికారిక వర్గాలు ఉంటాయి.
ఆయా హీరోలు ఒకరితో ఒకరు ఎలా ఉన్నా సరే.. అభిమానులు మాత్రం ఇలా వేర్వేరు వర్గాల్లో ఉంటారు. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు. ఒక వర్గం హీరో సినిమా కోసం ఇంకో వర్గం హీరో అతిథిగా వచ్చాడంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇప్పుడు అదే జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నేచురల్ స్టార్ నాని తళుక్కుమన్నాడు.
‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఇటీవలే విజయ్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆరంభ వేడుక సోమవారం జరిగింది. ఈ ఈవెంట్కు నాని అతిథిగా విచ్చేయగా.. వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నాని, విజయ్ అగ్ర కథానాయకులేమీ కాదు. వీళ్లిద్దరినీ రైవల్ హీరోలుగా చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో చేసిన ప్రత్యేక పాత్రతోనే విజయ్కు పేరొచ్చింది.
ఐతే గత కొన్నేళ్లలో విచిత్రంగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు శత్రువులుగా మారిపోయారు. పరస్పరం అవతలి హీరోను వీళ్లు కించపరచడం.. కారణం లేకుండా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మామూలైపోయింది. మిడ్ రేంజిలో ఈ ఇద్దరు హీరోల్లో ఒకరి మధ్య ఒకరికి ప్రొఫెషనల్గా పోటీ ఉన్న నేపథ్యంలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనుకోవడం..
అవతలి హీరోను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయడం అభిమానుల్లో మామూలైపోయింది. ఫ్యాన్ వార్స్ మరీ ఈ స్థాయికి పడిపోయాయి ఈ మధ్య. కానీ నాని, విజయ్ మధ్య ఏమీ లేదని.. ఇద్దరూ మంచి స్నేహితులని ఈ రోజు మరోసారి రుజువైంది. ఇది చూసి అయినా ఫ్యాన్స్.. అనవసర గొడవలు మానుకుంటే మంచిది.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…