తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు హీరోగా జీవిత ఖైదీ, అడవిదొర లాంటి సినిమాలు నిర్మించారాయన. ప్రస్తుతం అప్పుడప్పుడు చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. పదేళ్ల ముందు ఆయన డబ్ చేసి రిలీజ్ చేసిన తమిళ చిత్రం బిచ్చగాడు ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత నేరుగా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన చదలవాడకు పెద్దగా కలిసి రాలేదు. ఐతే ఇప్పుడాయన రూ.30 కోట్ల పెట్టుబడితో పది చిన్న సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు.
ఇటీవలే కొత్తగా ఎన్నికైన దర్శకుల సంఘం కార్యవర్గంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు చదలవాడ. దర్శకుల సంఘంలో చాలామంది సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారని.. అందులో ప్రతిభావంతులైన పది మందికి అవకాశం కల్పిస్తూ సినిమాలు నిర్మించాలని.. ఇందుకోసం రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వి.ఎన్.ఆదిత్య, సాయి రాజేష్ సహా పలువురు దర్శకుల సమక్షంలో ఆయన ప్రకటించారు.
ఎవరితో సినిమాలు తీయాలి.. ఎలాంటి చిత్రాలు నిర్మించాలి అనే విషయమై పరిశీలన జరిపేందుకు మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చదలవాడ వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం సినీ నిర్మాణ పోకడల గురించి చదలవాడ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒకప్పుడు శోభన్ బాబుతో రూ.70 లక్షల ఖర్చుతో జీవిత ఖైదీ సినిమాను నిర్మించానని.. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.7 కోట్ల షేర్ చేసిందని.. కానీ ఇప్పుడు నిర్మాతకు లాభాలు రావడం గగనంగా మారిందని ఆయన చెప్పారు. సినీ నిర్మాణ తీరే మారిపోయిందని.. బడ్జెట్లు పెరిగిపోయాయని.. నిర్మాత దారుణంగా దెబ్బతింటున్నాడని.. ఈ పరిస్థితుల్లో సినిమాల నిర్మాణం చాలా కష్టంగా మారిపోయిందని ఆయనన్నారు.
This post was last modified on April 21, 2026 9:01 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…