తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగించారు.
“అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే…” అంటూ సభను ప్రారంభించిన ఆయన, తన పుట్టినరోజు రోజున తమిళనాడులో ప్రజల మధ్య ఉండటం ప్రత్యేక ఆనందంగా ఉందని తమిళంలోనే చెప్పారు. ప్రారంభం నుంచే స్థానిక భాషలో మాట్లాడటం ద్వారా ప్రేక్షకులతో అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేశారు.
అలాగే “మున్నేట్రం వేణ్డుమా… వేలైవాయుప్ప గళ్ వేణ్డుమా…” అంటూ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల అంశాలను ప్రస్తావించారు. “అప్పడియానాల్ మధ్యతిల్ మోదీజీ ఇరుక్క వేణ్డుం… మానిలతిల్ అమ్మ ఆట్చి వర వేణ్డుం… ఇదుక్కు ఎన్డీఏ కూట్టణియై వెట్రి పెర చేయ్యుంగల్” అంటూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని, రాష్ట్రంలో మాజీ సీఎం జయలలిత పాలనను గుర్తుచేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు కోరారు.
ప్రసంగంలో ఆయన తమిళనాడు అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాలపై కూడా దృష్టి సారించారు. దక్షిణాదిలో అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర-రాష్ట్ర సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
గతంలో కూడా తమిళనాడులో ప్రచారం చేసినప్పటికీ, ఈ స్థాయిలో తమిళ భాషలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్థానిక సంస్కృతి, భాష పట్ల గౌరవాన్ని చూపుతూ మాట్లాడటం వల్ల సభకు వచ్చిన ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…