సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు ఎలా హల్చల్ చేశాయో తెలిసిందే. సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితుల్లో కొందరు ఇదంతా వాస్తవమే అని నమ్మారు. రాజశేఖర్కు తెలిసిన వాళ్లు కూడా ఆయనకు కాల్ చేసి ఈ గోలీల ఫ్యాక్టరీ గురించి అడిగారంటే ఆ వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఇటీవల ‘బైకర్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. ఈ గోలీల ఫ్యాక్టరీ వార్తలన్నీ కల్పితమని ఆయన తేల్చేశారు. ఐతే ఆ వీడియోల్లో క్రియేటివిటీ చూసి తాను కూడా నవ్వుకున్నట్లు చెప్పారు. వీలు దొరికినపుడల్లా ఈ విషయంలో ఆయన స్టేజ్ మీద పంచులు పేలుస్తూనే ఉన్నారు. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో.. ‘బైకర్’ చిత్రానికి తన గోలీల ఫ్యాక్టరీ నుంచే ఫైనాన్స్ చేసినట్లు ఆయన చెప్పడం అందరినీ నవ్వించింది.
ఇక ‘బైకర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ రాజశేఖర్ గోలీల ఫ్యాక్టరీ గురించి పంచ్ వేశారు. ‘బైకర్’ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక మీరు బైక్ల ఫ్యాక్టరీ పెడతారా అని ఓ విలేకరి అడిగితే.. తాను గోలీల ఫ్యాక్టరీని వదిలే ప్రసక్తే లేదని ఆయన చమత్కరించారు.
మరోవైపు ‘బైకర్’ సినిమాలో పని చేశాక తాను రాజశేఖర్ను నిజంగానే తండ్రిలా ఫీలవుతున్నానని అంటే, దానికి ఆయన బదులిస్తూ.. తన కూతుళ్లు నిన్న తనను ఏదో అంటే, ఇలా చేస్తే నా కొడుకు దగ్గరికి వెళ్లిపోతా అంటూ శర్వాను ఉద్దేశించి సరదాగా అన్నట్లు వెల్లడించారు.
ఇక తన జీవితంలో బైక్ రైడింగ్ అనుభవాల గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒకసారి ఫ్లైట్ అందుకోవడం లేటవుతుందని, తాను జీవిత కలిసి బైక్ మీదే ఎయిర్ పోర్టుకు వెళ్లామని చెప్పారు. మరో సందర్భంలో కారులో రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ట్రాఫిక్లో చిక్కుకున్నామని, అప్పుడో అభిమాని బైక్ మీద వచ్చి తనను పలకరిస్తే.. అతడిని తన కార్లో కూర్చోబెట్టి తన బైక్ తీసుకుని ఇద్దరం స్టేషన్కు వెళ్లామని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు.
This post was last modified on April 4, 2026 8:21 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…