Political News

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే మిగిలి ఉంది. ఇది కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చ‌ట్ట‌బ ద్ద‌త వ‌చ్చేసిన‌ట్టే కాబ‌ట్టి.. రాజ‌ధాని ప‌నుల‌ను నిర్దేశిత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. తాజాగా శ‌నివారం సాయంతం అమ‌రావ‌తి ప‌నుల‌పై చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. అమ‌రావ‌తి నిర్మాణం ఇక ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆల‌స్యం కావ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు.

దీనికి సంబందించి ఇప్ప‌టి వ‌ర‌కు వారం-నెల అన్న‌ట్టుగా విధించుకున్న ల‌క్ష్యాల‌ను ఇక‌పై `రోజు-వారం-నెల` అనే మూడు విధాలుగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఏ రోజు ఎంత ప‌నిచేయాలో.. ముందుగానే ప్ర‌ణాళిక వేసుకుని.. ఆమేర‌కు అయ్యేలా చూడాల‌న్నారు. అదేవిధంగా వారం, నెల కోసం.. కూడా ప్ర‌ణాళిక‌లు వేసుకుని.. ప‌నులు అదే స‌మ‌యంలో పూర్త‌య్యేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని ఆయ‌న మంత్రి నారాయ‌ణ‌, కాంట్రాక్టు సంస్థ‌లు, అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అదేస‌మ‌యంలో ఎంత మంది ప‌నిచేయాలి.. ప్ర‌స్తుతం ఎంత మంది ప‌నిచేస్తున్నారో.. కూడా తెలుసుకున్నారు.

అవ‌స‌రం అనిపిస్తే.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కార్మికుల‌ను తీసుకువ‌చ్చి ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌న్నారు. వ‌ర్షాకాలం వ‌చ్చేందుకు మరో అయిదారు మాసాల వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని.. ఆలోగా నిర్దిష్ట ల‌క్ష్యాల‌ను ఎట్టి ప‌రిస్థితిలో సాధించాల‌ని ఆయ‌న సూచించారు. అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించి ప‌నులు చేసే సంస్థ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు ఇచ్చేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తామ‌ని మంత్రికి తెలిపారు. ప్ర‌స్తుతం 57 వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి చెప్ప‌గా.. దీనిని మ‌రింత పెంచాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఒకేసారి ఒకే స‌మ‌యంలో మ‌ల్టిపుల్ వ‌ర్క్ జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోవాల‌న్నారు.

నియోజ‌క‌వ‌ర్గంతో మీకు ప‌నేంటి?

ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ‌ను ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నార‌ని.. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేద‌ని, నిరంత‌రం.. రాజ‌ధాని ప‌నుల‌పైనే దృష్టి పెట్టాల‌ని..నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను అధికారుల ద్వారా తెప్పించుకుని ఇక్క‌డ నుంచే ప‌ర్య‌వేక్షించాల‌ని ఆయ‌న సూచించారు. కేవ‌లం అమ‌రావ‌తి ప‌నుల కోస‌మే ఎక్కువ స‌మయం వెచ్చించాల‌ని సూచించారు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. `రాజ‌ధాని శత్రువులు` మ‌ళ్లీ చెల‌రేగి పోయే ప్ర‌మాదం ఉంద‌ని.. వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి పూర్తి చేసి.. రైతుల‌కు, రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన క‌ర్త‌వ్యం ప్ర‌భుత్వంపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

This post was last modified on April 4, 2026 8:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

2 hours ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

4 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

5 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

5 hours ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

6 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

8 hours ago