ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని ముందు జాగ్రత్త చర్యగా తమ ఏర్పాట్లలో తామున్నారు. దర్శకుడు బుచ్చిబాబు చెన్నై వెళ్ళిపోయి రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అక్కడే తిష్ట వేసినట్టు టాక్. ఐటెం సాంగ్ రెడీగా ఉన్నా ఎప్పుడు షూట్ చేస్తారనేది ఇప్పటిదాకా తేలలేదు. దాంట్లో ఆడే హీరోయిన్ ఎవరో కూడా తెలియదు.
రాకాస ప్రమోషన్లలో రామ్ చరణ్ ఎప్పుడైతే పెద్ది ఆలస్యం ఉండదని అన్నాడో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఏప్రిల్ 30 రిలీజ్ అవుతుందని అధిక శాతం అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. చేతిలో ఉన్న పాతిక రోజులు అన్ని పనులకు ఎలా సరిపోతాయనేది వాళ్ళ డౌట్. ఒకవేళ నిజంగా ఫిక్స్ చేసుకుంటే ఉరుకులు పరుగులు పెట్టి ఏదోలా మేనేజ్ చేయొచ్చు కానీ ముందైతే మాట మీద నిలబడుతుందా లేదానేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది
ఇంకోవైపు పెద్ది రాక నుంచి అనుమానాలు తొలగకపోవడంతో మే 1 షెడ్యూల్ చేసుకున్న గాయపడ్డ సింహం పబ్లిసిటీ మొదలుపెట్టేసింది. రెగ్యులర్ గా ప్రమోషన్లు చేయడానికి ప్రణాళిక వేసుకుని దాన్ని అమలు చేస్తున్నారు. చివరి నిమిషంలో కనక పెద్ది వస్తుందని తెలిస్తే అప్పుడు తప్పుకుంటుంది తప్ప లేదంటే మాత్రం ఆన్ టైం వచ్చేస్తుంది. ఇప్పటికీ పెద్ది జూన్ 25కి వెళ్ళిపోయిందనే నమ్మకం చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది. ఇదంతా క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చిన తంటా.
పాటలు, టీజర్లతో విపరీతమైన హైప్ తెచ్చుకున్న పెద్ది అంచనాల పరంగా పుష్ప 2 రేంజ్ లో మార్కెట్ లో డిమాండ్ తెచ్చుకుంది. 2026 లో ఇప్పటిదాకా మాస్ ని విపరీతంగా ఊపేసిన టాలీవుడ్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. మన శంకరవరప్రసాద్ గారు పండగ అయిపోయిన పది రోజుల తర్వాత స్లో అయిపోయింది. అలా కాకుండా పుష్ప 2 లాగా సాలిడ్ రన్ చూపించే కెపాసిటీ పెద్దికి ఉందని బయ్యర్లు నమ్ముతున్నారు. మరి దర్శక నిర్మాతలు ఏదో ఒకటి తేల్చేస్తే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది.
This post was last modified on April 4, 2026 7:22 pm
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…