అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం ప్రపంచాన్ని స్పెల్ బౌండ్ చేస్తుందని, అందరూ దీని గురించే మాట్లాడుకుంటారని, సోషల్ మీడియా ఊగిపోతుందని చాలా మంది భావించారు. ముంబైలో స్పెషల్ ప్రీమియర్ చూసిన మెజారిటీ మీడియా ప్రతినిధులు సైతం అదే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ రావడం షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు ఇది పెద్ద ట్విస్ట్.
ఎందుకంటే రామాయణ టీజర్ వచ్చాక ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మరోసారి ట్రోలింగ్ బారిన పడతారని ఎక్స్ పెక్ట్ చేసిన వాళ్లే ఎక్కువ. కానీ అలాంటిది జరగలేదు. ఒకవేళ రామాయణ యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకుని ఉంటే అదే అయ్యేది కానీ రన్బీర్ కపూర్ లుక్ బాగున్నప్పటికీ మిగిలిన క్యారెక్టర్లను రివీల్ చేయకపోవడం, కొన్ని విజువల్స్ లో ఏఐ ఛాయలు స్పష్టంగా కనిపించడం కొంత మైనస్ అయ్యింది. ఓవరాల్ గా చెప్పాలంటే గుడ్ అనే స్టాంప్ అయితే వేసుకుంది.
అసలు సమస్య ఇది కాదు. నిర్మాత నమిత్ మల్హోత్రా పలు ఇంటర్వ్యూలలో రామాయణ మొత్తం బడ్జెట్ నాలుగు వేల కోట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. సో అంచనాలు అదే స్థాయిలో ఏర్పడటం సహజం. టీజర్ బిగ్ స్క్రీన్ మీద చూడని వాళ్లకు అలా అనిపిస్తుందని ఏదో సమర్ధించుకునే ప్రయత్నం ఎవరైనా చేసినా, రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి కంటెంట్లను స్మార్ట్ ఫోన్ లో సైతం గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో ఎలా చూపిస్తాడనే లాజిక్ బయటికి వస్తుంది.
మొత్తానికి రామాయణ టీమ్ కొంత డిఫెన్స్ పడేలా ఇవాళ జరిగిన ట్రెండ్స్ దోహదం చేశాయి. నెక్స్ట్ సీత, రావణుడి టీజర్లు వస్తాయి. ఆపై ట్రైలర్ ఉంటుంది. పాటలు రావాలి. సో పబ్లిసిటీలో కీలక ఘట్టాలు చాలానే ఉన్నాయి. వీటిని వదలబోయే ముందు రామకు వచ్చిన రియాక్షన్లు గుర్తు పెట్టుకుని అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా క్వాలిటీ చెక్ చేసుకునే బాధ్యత మేకర్స్ మీద ఉంది. తెలుగు ఫ్యాన్స్ కి మాత్రం రామాయణ టీజర్ సంతృప్తినివ్వలేదు. సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది.
This post was last modified on April 2, 2026 11:06 pm
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…