బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్తో మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు, షూటింగ్స్కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్ ద్వారా గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత కియారా ఒక పబ్లిక్ ఈవెంట్లో మెరవడంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ ఈవెంట్ లో కియారా చాక్లెట్ బ్రౌన్ కలర్ లెదర్ గౌనులో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె చాలా ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తోంది. తల్లి అయిన తర్వాత కూడా ఆమె తన ఫిట్నెస్ గ్లామర్ ను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఫోటోషూట్ చూస్తుంటే తను మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతోంది.
కియారా అద్వానీకి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ‘వార్ 2’ తరువాత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. నెక్స్ట్ బైలింగువల్ మూవీ ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతోంది.
వార్ 2 లో బికినీ ట్రీట్ తరువాత అమ్మడు మళ్ళీ పెద్దగా హైలెట్ కాలేదు. ఇక మొత్తానికి ఈ ఒక్క అప్పీయరెన్స్ ఆమెపై ఉన్న క్రేజ్ ను మరోసారి గుర్తు చేసింది. గ్లామర్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, కేవలం ఒకే ఒక్క లుక్ తో ఈవెంట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచిన కియారా, రాబోయే సినిమాల్లో కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.
This post was last modified on March 26, 2026 7:08 pm
Page: 1 2
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క…
చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో ఇక నుంచి చేపల కూర కూడా వచ్చించనున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు…
అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…
తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…