Political News

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధ‌ర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒక‌సారి లేదా వీలునుబ‌ట్టి రెండు సార్లు చేప‌ల కూర కూడా వ‌డ్డించేందుకు.. ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ఇస్తున్న కోడిగుడ్డు ఫ‌లితంగా విద్యార్థుల్లో భౌతిక సామ‌ర్థ్యాలు మెరుగుప‌డుతున్నాయ‌న్నారు.

ముఖ్యంగా పౌష్ఠికాహార లోపం త‌గ్గుతోంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో రాష్ట్రం ముందు వ‌రుస‌లో ఉంద‌ని.. ఇంకా మ‌రింత దిగుబ‌డి వ‌చ్చేలా పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. త‌ద్వారా అంగ‌న్ వాడీలు, స్కూళ్ల‌లో వారానికి మ‌రిన్ని సార్లు కోడిగుడ్లు ఇచ్చే విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నట్టు వివ‌రించారు. ఇక‌, చేప‌ల ఉత్ప‌త్తిలోనూ రాష్ట్రం దూసుకుపోతోంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యార్థుల‌కు పెడుతున్న మ‌ధ్యాహ్న భోజ‌నంలో చేప‌ల‌ను కూడా వ‌డ్డించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌న్నారు. ప్రాథ‌మిక ద‌శ‌లో వారానికి ఒక‌సారి త‌ర్వాత‌.. రెండేసి సార్లు చేప‌ల కూర‌, లేదా పులుసును ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చిన్నారుల్లో దృష్టి సంబంధ‌మైన స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయ‌ని.. చేప‌ల ద్వారా ఆ స‌మస్య‌ను అధిగ‌మించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

దేశంలో ఫ‌స్ట్‌..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఈ భోజ‌నంలో కోడిగుడ్డును ఇవ్వ‌డం(వారానికి రెండు సార్లు) త‌ప్ప‌నిస‌రి. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో చిక్కీలు (ప‌ల్లీ చెక్క‌లు) కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల రాగి సంక‌టిని.. మ‌రికొన్ని చోట్ల జొన్న రొట్టెల‌ను కూడా అందిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ల కూర‌ను వ‌డ్డించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌. ఇది అమ‌లైతే.. మ‌రిన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంది. 

This post was last modified on March 26, 2026 6:09 pm

Share

Recent Posts

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

2 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

7 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

10 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

11 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

11 hours ago