ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. వారియర్ లాంటివి డిజాస్టర్ అయితే అందులో స్వీయ తప్పిదమో దర్శకుడి మిస్టేకో అనుకోవచ్చు. కానీ పాజిటివ్ టాక్ వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకాకి ఫ్లాప్ ముద్ర దక్కడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరీ ఎక్స్ ట్రాడినరి కంటెంట్ కాకపోయినా నిరాశపరిచే ఎలిమెంట్స్ అయితే లేవు. అయినా సరే ప్రేక్షకులకు ఇందులో ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ కనెక్ట్ కాలేదు.
దీని సంగతలా ఉంచితే అయిదు నెలలు దాటుతున్నా రామ్ కొత్త మూవీ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ఎవరెవరో కథలు చెప్పారు. ఎన్నెన్నో విన్నాడు. తనే స్వయంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఏవీ ముందుకు వెళ్ళలేదు. ఫైనల్ గా ఒక కోలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లోకేష్ కనగరాజ్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన లోగి విగ్నేష్ చెప్పిన స్టోరీ నచ్చడంతో దానితోనే ప్రొసీడ్ అవ్వొచ్చని అంటున్నారు. త్వరలోనే ప్రకటన వస్తుంది.
లోకేష్ అసోసియేట్ అంటే టాలెంట్ ఉన్నవాడే అయ్యుంటాడు. పైగా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటిదాకా దాకా రాని డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో సబ్జెక్టు రెడీ అయ్యిందట. డెబ్యూ మూవీగా లోకేష్ చేసిన మానగరం అప్పట్లో ఆడియన్స్ ని ఎంత సర్ప్రైజ్ చేసిందో తెలిసిందే. గురువు దారిలోనే శిష్యుడు ప్రయాణం చేస్తున్నట్టు తెలిసింది. అయితే నిర్మాణ సంస్థ ఫైనల్ కాలేదు. మైత్రి నుంచి దిల్ రాజు దాకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి కానీ లాకయ్యేది ఎవరో తెలియాల్సి ఉంది.
తమిళ దర్శకుడితో రామ్ కు చేదు అనుభవం గతంలో ఉంది. లింగుస్వామిని గుడ్డిగా నమ్మి ది వారియర్ చేయడం తగిన మూల్యాన్ని చెల్లించేలా చేసింది. అయితే ఇందులో రామ్ దే పొరపాటు. ఫామ్ లో లేని సీనియర్ కోలీవుడ్ డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేసి రొట్ట రొటీన్ సినిమా చేయడం పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. రియలైజ్ అయ్యేలోపే డ్యామేజ్ జరిగిపోయింది. కానీ లోగి విగ్నేష్ యువ రక్తం కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. స్టార్ట్ చేస్తే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…