ఈ రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్ కూడా చేయలేని లాభం.. ఒక మంచి పాట చేసేస్తుంది. మంచి ఊపున్న పాట కంపోజ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలితే.. అది క్లిక్ అయిందంటే చాలు, సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. రీల్స్, షార్ట్స్లో ఆ పాట వైరల్ అయిందంటే.. జరగాల్సిన ప్రమోషన్ అంతా జరిగిపోతుంది.
ఈ మధ్య కాలంలో అలా బాగా వైరల్ అయిన పాటలు.. ‘పెద్ది’లోని చికిరి చికిరి.. ‘ది ప్యారడైజ్’లోని ఆయా షేర్. ఈ నెల చివర్లో ఒకే వీకెండ్లో విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలు.. వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. వీటి మధ్య ఇప్పుడు పోటీ లేదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సాంగ్స్తో ఆ రెండు చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్లూ వావ్ అనిపించారు.
‘పెద్ది’ కోసం ఏఆర్ రెహామన్ కంపోజ్ చేసిన ‘చికిరి’ పాట కొన్ని నెలలుగా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘రా రా రైరా’ కూడా బాగానే జనాలను ఆకట్టుకుంది. మరోవైపు ‘ది ప్యారడైజ్’ సంగీత దర్శకుడు అనిరుధ్ నుంచి ఈ మధ్యే వచ్చిన ఆయా షేర్ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ పాటల హైప్ను ఇంకో లెవెల్కు తీసుకెళ్లేలా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు వాటిని ప్రమోట్ చేస్తున్న తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్లో ‘ఆయా షేర్’ పాటతో అనిరుధ్ మామూలు రచ్చ చేయలేదు. ‘ది ప్యారడైజ్’ హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా హాజరైన ఈ కన్సర్ట్లో ఆ పాటే మేజర్ హైలైట్గా నిలిచింది.
ఇక ఏఆర్ రెహమాన్ తాజాగా ‘రా రా రైరా’ సాంగ్ను చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో పెర్ఫామ్ చేశారు. ఇది క్రికెట్ నేపథ్యం ఉన్న పాట కావడంతో అక్కడి జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఆల్రెడీ ‘రా రా రై రా’ పాటను క్రికెట్ లవర్స్ బాగా వాడుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్తో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ ఈ పాటను సీఎస్కే ఈవెంట్లో పెర్ఫామ్ చేసి దాని పాపులారిటీని మరింత పెంచాడు. ఇలా ఇద్దరు టాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు పాటల మీద ఇంత శ్రద్ధ పెట్టి, ప్రమోట్ చేయడం విశేషమే.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…