Political News

గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా సెల్వమణి చేసిన ఒక కామెంట్‌తో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కింది. 

ఆమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి, వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉగాది పండుగను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని.. తమ కుటుంబాలతో కలిసి ఉగాది వేడుకలు చేసుకోలేదేంటని విమర్శిస్తూ.. వారిని ‘గాడిదలు’ అంటూ సంబోధించారు రోజా.

ఐతే అదే రోజు సాయంత్రం తిరుపతికి చెందిన జనసేన నేత సుభాషిణి.. ప్రెస్ మీట్ పెట్టి రోజా తీరును దుయ్యబట్టారు. ఆమె జగన్ సతీమణి భారతిని అడ్డగాడిద అని సంబోధిస్తూ.. అధికారంలో ఉన్నపుడు ఈ అడ్డగాడిద ఎక్కడికి పోయింది, తిరుమలకు రాలేదేంటి.. పూజల్లో పాల్గొనలేదేంటి అంటూ విమర్శలు చేశారు.

ఇక అంతే వైసీపీ వాళ్లు పెద్ద ఎత్తున లైన్లోకి వచ్చేశారు. పవన్ కళ్యాణే ఇలా సుభాషిణితో మాట్లాడించాడని.. దీనికి మూల్యం చెల్లించుకుంటారని.. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేయని భారతి రెడ్డి గురించి ఇలా మాట్లాడ్డమేంటని.. కుటుంబాల జోలికి వచ్చి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడమేంటని.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయం అన్న పవన్ కళ్యాణ్‌ ఈ కామెంట్ల మీద ఏం సమాధానం ఇస్తాడని వాళ్లు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఇలా మాట్లాడుతున్న వాళ్లు.. రోజా చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం ఏమీ స్పందించట్లేదు.

తిరుమలకు వెళ్లి రాజకీయ వ్యాఖ్యలు, అందునా దూషణలకు దిగిన రోజును కంట్రోల్ చేయకుండా.. ఆమె భాషలోనే సమాధానం చెప్పిన తమ నాయకురాలిని తప్పుబట్టడం ఏంటి అంటూ జనసైనికులు మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో స్కూల్ పిల్లల ముందు పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన ఘనత జగన్‌దే అని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్‌ల మీద వ్యక్తిగతంగా దారుణమైన మాటలు మాట్లాడిన పోసాని, బోరుగడ్డ, పేర్ని నాని సహా ఎంతోమందిని ప్రోత్సహించింది జగనేనని.. చరిత్ర మరిచిపోయి తమ మీద ఎదురుదాడి చేస్తారా అంటూ జనసైనికులు దీటుగా బదులిస్తున్నారు. దీని మీద రెండు రోజులుగా సోషల్ మీడియా రణరంగంగా మారింది.

This post was last modified on March 23, 2026 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పండగ వస్తున్నా ‘రామాయణ’ సౌండ్ లేదే

భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ గా 'రామాయణ' గురించి నిర్మాతలు ఎంత…

1 hour ago

ధురంధర్ 2 ఎఫెక్ట్.. పాక్ లో ‘స్పై’ లను వెతుకుతున్నారా? నిజమెంత?

​రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.…

2 hours ago

ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర…

2 hours ago

చిరు సినిమాకు కోన రచన

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన రచయితల్లో కోన వెంకట్ ఒకరు. డబ్బింగ్ సినిమా అయిన ‘సత్య’తో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన…

4 hours ago

మార్పు దిశ‌గా మాచ‌ర్ల.. !

ప‌ల్నాడు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకున్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఇటీవ‌ల కాలంలో తీవ్ర…

5 hours ago

పవన్ మార్కెట్ దెబ్బ తినేసిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. ఫ్లాప్…

7 hours ago