గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ అవార్డులను రెగ్యులర్గా ప్రకటించడానికి పూనుకున్న ప్రభుత్వం.. ఇటీవలే 2025 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది. ఈ అవార్డుల వేడుకను ఉగాది రోజున హైటెక్స్ వేదికగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి.
కానీ చివరికి చూస్తే ఆ వేడుక గందరగోళంగా మారి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏర్పాట్లు సరిగా చేయకపోవడం, మేనేజ్మెంట్ బాధ్యతలు ముంబై సంబంధిత సంస్థకు ఇవ్వడం, సమన్వయం లేకపోవడం.. ప్లానింగ్ లోపం వల్ల అయోమయ పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. చాలామంది అవార్డు విజేతలకు కుర్చీలు కూడా లేక నిలబడే వేడుకను చూడాల్సిన పరిస్థితి తలెత్తిందట. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా కొందరు దిగ్గజాలకు ముందు వరుసలో సీట్లు కేటాయించకపోవడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్కు అవమానం జరిగి ఆయన ఈ వేడుక నుంచే వెళ్లిపోయినట్లు సమాచారం. అంత పెద్ద రచయితను గుర్తించలేక ఆర్.నారాయణమూర్తిగా పేర్కొనడంతో హర్టయి వెనక్కి వెళ్లిపోయారట రాజమౌళి తండ్రి. మరోవైపు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాతో పాటుగా వచ్చిన బౌన్సర్లకు.. దిల్ రాజు పర్సనల్ అసిస్టెంట్కు మధ్య పెద్ద గొడవ జరిగి.. ఆ పీఏను ఈవెంట్ నుంచి పంపించేయాల్సి వచ్చినట్లు సమాచారం.
ఇలా గద్దర్ అవార్డుల వేడుక మొత్తం గందరగోళంగా తయారైందని.. ఏర్పాట్లు ఘోరమని.. ప్లానింగ్ పేలవమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సుమ, ప్రదీప్ మాచిరాజుల మీద కూడా విమర్శలు తప్పట్లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలో వాళ్లిద్దరూ చిరంజీవి సతీమణి దగ్గరికెళ్లి ఈ రోజు వంటలేంటి అంటూ ముచ్చట్లు పెట్టడం విమర్శలకు దారి తీసింది. ఇలా మొత్తంగా గద్దర్ అవార్డుల వేడుక నిర్వహణ అనేక విమర్శలకు కారణమవుతోంది.
This post was last modified on March 20, 2026 12:53 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…