వివాహేతర సంబంధాలు ఎంతకైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భర్తలపై భార్యలు, భార్యలపై భర్తలు కసి తీర్చుకుంటున్నారు.(అందరూ కాదు.. 100కు 3 శాతం మంది అనిఇటీవల సర్వేలు చెప్పాయి) ఈ క్రమంలో భర్తలను హత్య చేయిస్తున్న భార్యల సంగతులు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా గురువారం ఏపీలోని నంద్యాలలోనూ ఇలాంటి వివాహేతర సంబంధం వెలుగుచూసింది. ఈ ఘటనలో భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. అతనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. అయితే.. పోలీసు విచారణలో `వాస్తవం` వెలుగు చూసి.. మొత్తంగా ప్రియుడు, భార్య కూడా జైలుకు వెళ్లారు.
ఇక, తాజాగా గురువారం ఉత్తర ప్రదేశ్లో మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త.. తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించాడు. దీంతో ఆమె మాట్లాడుతున్న ఫోన్ను తీసుకుని చూడగా.. దాని `బ్లూ డ్రమ్` కథనంతోపాటు.. భర్తలను ఎలా హత్య చేయాలన్న యూట్యూబ్ లింకులు కూడా కనిపించాయి. దీంతో హడలిపోయిన సదరు భర్త.. ఆమెతో మంచిగా మాట్లాడి.. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భార్యతో చేతులు కలిపించి మరీ సాగనంపాడు.
ఏం జరిగింది?
యూపీలోని బులందేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్కుమార్కు మూడేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు.. ఆరు మాసాల బిడ్డ కూడా ఉంది. అయితే.. ఇటీవల ఆమె సమీపంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధంలో పడింది. ఇది ప్రేమగా మారి.. పుట్టింటి పేరుతో ప్రియుడితో కలిసి తిరగడం ప్రారంభంచింది. ఈ విషయం భర్తకు తెలిసి.. ఒకసారి మందలించాడు. ఈ క్రమంలో తాను తప్పు చేయడం లేదని చెప్పిన భార్య ఏమాత్రం మారలేదని గ్రహించాడు.
ఇక, ఇటీవల ఆమె ఫోన్ను చూడగా.. దానిలో అనేక వీడియోలు.. కనిపించాయి. ప్రియుడు, ఆమె కలిసి ఉన్న ఫొటోలు, ఏకాంత వీడియోలు కూడా దర్శనమిచ్చాయి. వీటితోపాటు బ్లూడ్రమ్ స్టోరీ సహా పలు లింకులు కూడా కనిపించాయి. దీంతో హడలిపోయిన భర్త.. ఆమెను ప్రియుడితో పంపించేసి.. బిడ్డను మాత్రం తన దగ్గర ఉంచుకున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేస్తామని చెప్పినా.. ఏమో.. తనను చంపేస్తారేమోనని కేసును కూడా వెనక్కి తీసుకున్నాడు.
ఏంటీ బ్లూ డ్రమ్ స్టోరీ..
ఇటీవల కాలంలో బ్లూ డ్రమ్ స్టోరీ ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. తన భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది. ప్రియుడితో కలిసి.. ఆ ముక్కలను ఓ బ్లూడ్రమ్(నీళ్ల కోసం వినియోగించేది)లో వేసి.. దానిని సిమెంటు+ఇసుక మిశ్రమంతో పూడ్చేసింది. అనంతరం.. గుమ్మంలోనే పెట్టుకుంది. అయితే.. ఆ డ్రమ్ ముందు.. కుక్కలు పెరిగిపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు డ్రమ్ను పగలకొట్టి చూడగా.. శరీర భాగాలు వెలుగు చూశాయి. అప్పటి నుంచి ఈ ఘటన బ్లూ డ్రమ్ స్టోరీగా ప్రచారంలోకి వచ్చింది.
This post was last modified on March 20, 2026 12:53 pm
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…