‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత భారతీయ సినీ ప్రేక్షకులు అంతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘కేజీఎఫ్-చాప్టర్ 2’నే. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వివిధ భాషల్లో విడుదలై అన్ని చోట్లా సంచలన విజయం సాధించిందీ చిత్రం. కన్నడలో ఈ సినిమా ఆడటం ఆశ్చర్యమేమీ కాదు కానీ.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించడమే ఆశ్చర్యం.
ఇక అప్పట్నుంచి చాప్టర్-2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కరోనా లేకుంటే ఈ ఏడాది దసరాకే ‘కేజీఎఫ్-2’ సందడి చేసేది. కానీ ఆ మహమ్మారి వల్ల చిత్రీకరణ ఆలస్యమై.. వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐతే ఇటీవలే షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో 2021 వేసవిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ‘కేజీఎఫ్-2’కు సంబంధించి ఒకట్రెండు పోస్టర్లు మినహాయిస్తే ఏమీ విడుదల కాలేదు. ఐతే అతి త్వరలోనే టీజర్ రాబోతోంది. ఇందుకు ముహూర్తం కుదిరింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జనవరి 8న ‘కేజీఎఫ్-2’ టీజర్ రాబోతోంది. ఆ రోజు హీరో యశ్ పుట్టిన రోజు. ఈ ఏడాది కూడా జనవరి 8న ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా పుణ్యమా అని టీజర్ రావడానికి ఇంకో ఏడాది పట్టేసింది.
డిసెంబరు 21తో ‘కేజీఎఫ్’ విడుదలకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగానే టీజర్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ‘ఎ గ్లాన్స్ ఇన్ టు ద ఎంపైర్’ అంటూ క్యాప్షన్ జోడించి కేజీఎఫ్ సామ్రాజ్య సింహాసనంపై రాకీ (యశ్) కూర్చున్న ఫొటోతో పోస్టర్ రిలీజ్ చేశారు. మరి సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో టీజర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 21, 2020 5:53 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…