‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడంతో దాన్ని అక్కడి సెలబ్రెటీలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదొక అద్భుతం అంటూ కొనియాడారు. కానీ ఆ చిత్రమే ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ప్రాధాన్యాన్ని తగ్గించేసింది. సౌత్ చిత్రాల హవా పెరిగిపోయి బాలీవుడ్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది.
దీంతో తర్వాత సౌత్ సినిమాలను సపోర్ట్ చేయడం తగ్గించేశారు బాలీవుడ్ సెలబ్రెటీలు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటించినా.. ఇండస్ట్రీ సైలెంటుగానే ఉంది. ‘కేజీఎఫ్-2’, ‘పుష్ప-2’ చిత్రాలు నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసినా సౌండ్ లేదు. ఈ సినిమాలన్నింటినీ చూసి అక్కడి వాళ్లు అసూయ పడ్డ సంకేతాలు కనిపించాయి. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ కొత్త సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అండగా నిలవబోతుండడం విశేషం.
తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కానుకగా విడుదల కాబోతోంది. ముందు రోజు అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ఈ గ్లింప్స్ను లాంచ్ చేయబోతున్నారట. ముంబయిలో షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ కానుండగా.. వర్చువల్గా బన్నీ, అట్లీ అండ్ టీం ఈ కార్యక్రమంలో పాల్గొంటుందని సమాచారం.
ఈ గ్లింప్స్ను షారుఖ్ లాంచ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ‘జవాన్’ రూపంలో అట్లీ.. షారుఖ్కు భారీ విజయాన్ని అందించాడు. అతడితో షారుఖ్ మరో సినిమా కూడా చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బన్నీతో అట్లీ సినిమాకు సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారంగానే చూడాలి. త్వరలో ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
బన్నీ, అట్లీ ఇద్దరూ సౌత్ వాళ్లే. కానీ నార్త్లో ఫాలోయింగ్ ఉంది. అయినా సరే.. షారుఖ్ చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజైతే వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇక ఈ గ్లింప్స్ ఒక రేంజిలో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on March 11, 2026 4:48 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…