మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు సడెన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా.. ఫర్మాన్ ఖాన్ అనే కేరళ ముస్లిం యువకుడితో ప్రేమలో పడిందట.
ఫేస్ బుక్ ద్వారా వీళ్లిద్దరికీ జరిగిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిగా వీరి ప్రేమాయణం సాగుతుండగా.. మోనాలిసా ఇంట్లో విషయం తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. అంతేకాక మోనాలిసాను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారట.
దీంతో మోనాలిసా తాను షూటింగ్లో పాల్గొంటున్న చోటి నుంచి ఫర్మాన్ కోసం కేరళకు వచ్చేసింది. ఇద్దరూ కలిసి తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్లోకు వెళ్లారు. తన తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడం లేదని.. వారి నుంచి తమకు రక్షణ కావాలని ఫర్మాన్తో కలిసి ఆమె పోలీసులను కోరింది.
ఆ తర్వాత ఆమె ఫర్మాన్ను పెళ్లి కూడా చేసుకుంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె కెమెరాల ముందుకు వచ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.
పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఒక బాలీవుడ్ సినిమాలో అవకాశం కూడా అందుకుంది. ఆమెకు మరి కొన్ని అవకాశాలు వస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
కొన్ని నెలల్లోనే పూర్తిగా అవతారం మార్చేసిన మోనాలిసా.. మోడలింగ్లోకి కూడా అడుగు పెట్టింది. అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. కానీ తర్వాత మోనాలిసా పెద్దగా మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మోనాలిసా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది.మోనాలిసాకు 18 ఏళ్లు నిండి మేజర్ అయిన నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి ఏ ఇబ్బందీ లేకపోయింది. పోలీసులు ఇచ్చిన భరోసాతో మోనాలిసా, ఫర్మాన్ వివాహంతో ఒక్కటయ్యారు.
This post was last modified on March 11, 2026 9:38 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…