మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు సడెన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా.. ఫర్మాన్ ఖాన్ అనే కేరళ ముస్లిం యువకుడితో ప్రేమలో పడిందట.
ఫేస్ బుక్ ద్వారా వీళ్లిద్దరికీ జరిగిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిగా వీరి ప్రేమాయణం సాగుతుండగా.. మోనాలిసా ఇంట్లో విషయం తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. అంతేకాక మోనాలిసాను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారట.
దీంతో మోనాలిసా తాను షూటింగ్లో పాల్గొంటున్న చోటి నుంచి ఫర్మాన్ కోసం కేరళకు వచ్చేసింది. ఇద్దరూ కలిసి తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్లోకు వెళ్లారు. తన తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడం లేదని.. వారి నుంచి తమకు రక్షణ కావాలని ఫర్మాన్తో కలిసి ఆమె పోలీసులను కోరింది.
ఆ తర్వాత ఆమె ఫర్మాన్ను పెళ్లి కూడా చేసుకుంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె కెమెరాల ముందుకు వచ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.
పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఒక బాలీవుడ్ సినిమాలో అవకాశం కూడా అందుకుంది. ఆమెకు మరి కొన్ని అవకాశాలు వస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
కొన్ని నెలల్లోనే పూర్తిగా అవతారం మార్చేసిన మోనాలిసా.. మోడలింగ్లోకి కూడా అడుగు పెట్టింది. అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. కానీ తర్వాత మోనాలిసా పెద్దగా మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మోనాలిసా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది.మోనాలిసాకు 18 ఏళ్లు నిండి మేజర్ అయిన నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి ఏ ఇబ్బందీ లేకపోయింది. పోలీసులు ఇచ్చిన భరోసాతో మోనాలిసా, ఫర్మాన్ వివాహంతో ఒక్కటయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…