Movie News

దేవి వర్క్ అంతా స్క్రాప్‌లోకేనా?

ఇంకో రెండు వారాల్లో, ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముందు అనుకున్న దాని కంటే వారం ముందుగా సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బీజీఎం బాధ్యతల నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవాల్సి వచ్చినట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దేవిశ్రీ టైంలైన్‌కు తగ్గట్లుగా తాము కంటెంట్ ఇవ్వలేకపోయామని.. తాను కంటెంట్ ఇచ్చే సమయానికి దేవి అందుబాటులో ఉండట్లేదని.. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో దేవి బదులు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడని నిన్న ఒక నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దీన్ని బట్టి చూస్తే ‘ఉస్తాద్’కు దేవి అసలు బీజీఎం పనే మొదలుపెట్టలేదని ఎవ్వరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని కొన్ని రోజుల ముందు ‘ఉస్తాద్’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.

ఆ ఈవెంట్లో పక్కన హరీష్ శంకర్ సహా పలువురు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఉండగా.. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ బీజీఎం వర్క్ గురించి మాట్లాడాడు. ఆల్రెడీ నేపథ్య సంగీతం పని మొదలైందని.. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందని దేవి ఆ సందర్భంగా చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి హరీష్ శంకర్ అనుమతిస్తాడో లేదో అని అంటుండగా.. హరీష్ వచ్చి భుజం తట్టాడు.

తర్వాత దేవి కొనసాగిస్తూ.. ఈ సినిమాకు బీజీఎం చేయకముందు సన్నివేశాలు చూసే తమ స్టూడియోలో అందరూ హర్షాతిరేకాలు చేశారని.. బీజీఎం కూడా తోడైతే ఔట్ పుట్ ఊహించుకోండి అన్నట్లు మాట్లాడాడు. సినిమాను హరీష్ వేరే లెవెల్లో తీశాడని.. మిగతా అంతా ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు అని కూడా దేవి ఆ సందర్భంగా చెప్పాడు.

మిగతా విషయాలు పక్కన పెడితే.. దేవి మాటల్ని బట్టి చూస్తే అతను బీజీఎం దాదాపుగా ఫినిష్ చేసినట్లే చెప్పాడు. అలాంటపుడు టైం లైన్‌కు సెట్ కాలేదని దేవి స్థానంలో తమన్‌ను తీసుకురావడం అన్నది ఎంత వరకు నిజం అన్నది ప్రశ్నార్థకం. బహుశా దేవి వర్క్ పట్ల సంతృప్తి చెందకపోవడం, అతను ఆలస్యం చేస్తుండడం వల్ల తమన్‌ను ఎంచుకున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. తమన్‌తో బీజీఎం చేయించడం పట్ల దేవి మౌనం పాటిస్తుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

Kumar

Recent Posts

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…

52 minutes ago

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

2 hours ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

2 hours ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

4 hours ago

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…

8 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

10 hours ago