ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే. తమిళ టాప్ స్టార్ విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
తన భార్య సంగీతతో 20 ఏళ్లకు పైగా అన్యోన్యంగానే ఉన్నాడు విజయ్. కానీ కొన్నేళ్ల ముందు వీరి బంధం బీటలు వారింది. అప్పట్నుంచి విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసింది. అదే సమయంలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో పాటు అనేక ఆరోపణలు చేసింది సంగీత. దీంతో సీనియర్ హీరోయిన్ త్రిషతో విజయ్ బంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వారం రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అధికార డీఎంకే పార్టీ ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఐతే విడాకుల వ్యవహారం ఎక్కువ రోజులు మీడియాలో నానకుండా దాన్ని ఒక కొలిక్కి తెచ్చేయాలని విజయ్ చూస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టులో కంటే ముందు బయట సెటిల్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడట. రూ.250 కోట్లకు ఈ సెటిల్మెంట్ను పూర్తి చేసేందుకు చూస్తున్నాడట.
భార్య, పిల్లల కోసం ఈ మొత్తాన్ని అందజేయనున్న విజయ్.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సంగీత దంపతులకు జేసన్ సంజయ్, సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా రూపొందిస్తున్నాడు. సాషా చదువుకుంటోంది. విజయ్ వ్యక్తిగత విషయాలు మీడియాలో ఎక్కువ రచ్చ కాకుండా వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on March 4, 2026 4:34 pm
గ్రామీణ భారతంపై జనసేన సైలెంట్ వేవ్తో దూసుకుపోతోందా? ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితం అయిన జనసేన ఇప్పుడు గ్రామీణ…
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs…
టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ది సపరేట్ స్టయిల్. కొంచెం టైం తీసుకుని అయినా ప్రత్యేకమైన పాటలు, బీజీఎం ఇవ్వాలని…
ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా…
పోయినేడాది వేసవి పెద్ద సినిమాలు లేక వెలవెలబోయింది. కానీ ఈసారి సమ్మర్ మాత్రం అలా ఉండదనే సంకేతాలు కనిపించాయి. వేసవి…
శాసన మండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మండలిలో లడ్డూ ఇష్యూపై వైసీపీ, టీడీపీ సభ్యుల…