ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే. తమిళ టాప్ స్టార్ విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
తన భార్య సంగీతతో 20 ఏళ్లకు పైగా అన్యోన్యంగానే ఉన్నాడు విజయ్. కానీ కొన్నేళ్ల ముందు వీరి బంధం బీటలు వారింది. అప్పట్నుంచి విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసింది. అదే సమయంలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో పాటు అనేక ఆరోపణలు చేసింది సంగీత. దీంతో సీనియర్ హీరోయిన్ త్రిషతో విజయ్ బంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వారం రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అధికార డీఎంకే పార్టీ ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఐతే విడాకుల వ్యవహారం ఎక్కువ రోజులు మీడియాలో నానకుండా దాన్ని ఒక కొలిక్కి తెచ్చేయాలని విజయ్ చూస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టులో కంటే ముందు బయట సెటిల్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడట. రూ.250 కోట్లకు ఈ సెటిల్మెంట్ను పూర్తి చేసేందుకు చూస్తున్నాడట.
భార్య, పిల్లల కోసం ఈ మొత్తాన్ని అందజేయనున్న విజయ్.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సంగీత దంపతులకు జేసన్ సంజయ్, సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా రూపొందిస్తున్నాడు. సాషా చదువుకుంటోంది. విజయ్ వ్యక్తిగత విషయాలు మీడియాలో ఎక్కువ రచ్చ కాకుండా వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on March 4, 2026 4:34 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…