ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే. తమిళ టాప్ స్టార్ విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
తన భార్య సంగీతతో 20 ఏళ్లకు పైగా అన్యోన్యంగానే ఉన్నాడు విజయ్. కానీ కొన్నేళ్ల ముందు వీరి బంధం బీటలు వారింది. అప్పట్నుంచి విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసింది. అదే సమయంలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో పాటు అనేక ఆరోపణలు చేసింది సంగీత. దీంతో సీనియర్ హీరోయిన్ త్రిషతో విజయ్ బంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వారం రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అధికార డీఎంకే పార్టీ ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఐతే విడాకుల వ్యవహారం ఎక్కువ రోజులు మీడియాలో నానకుండా దాన్ని ఒక కొలిక్కి తెచ్చేయాలని విజయ్ చూస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టులో కంటే ముందు బయట సెటిల్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడట. రూ.250 కోట్లకు ఈ సెటిల్మెంట్ను పూర్తి చేసేందుకు చూస్తున్నాడట.
భార్య, పిల్లల కోసం ఈ మొత్తాన్ని అందజేయనున్న విజయ్.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సంగీత దంపతులకు జేసన్ సంజయ్, సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా రూపొందిస్తున్నాడు. సాషా చదువుకుంటోంది. విజయ్ వ్యక్తిగత విషయాలు మీడియాలో ఎక్కువ రచ్చ కాకుండా వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…