Political News

మిర్చి అందాలతో పర్యాటక అభివృద్ధి?

ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. క్రమపద్ధతిలో ఆరబోసిన మిర్చి కుప్పలు ఎర్ర తివాచీలా దర్శనం ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి.

మిర్చి క్షేత్రాల నుంచి సాగుతున్న రవాణా వ్యవస్థ, ఎర్రటి మిర్చి రాశుల మధ్య సన్నని తారు రోడ్లపై దూసుకెళ్తున్న బస్సులు, లారీలు, పక్కనే పరిగెత్తుతున్న రైలు దృశ్యాలు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ డ్రోన్ చిత్రాలు గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి.

ఈ ఎర్ర బంగారం అందాలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి నారా లోకేష్ వీడియో మరింత వైరల్ అయింది. దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోపై స్పందిస్తూ “హోలీ పండుగ సందర్భంగా చూడదగిన అద్భుత దృశ్యం” అంటూ ప్రశంసించారు.

భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చిలో గుంటూరు జిల్లాకే సుమారు 15 శాతం వాటా ఉందని పేర్కొంటూ, ఈ సీజనల్ పంటను పర్యాటక ఆకర్షణగా మలచవచ్చా? అనే ప్రశ్నను లేవనెత్తారు. స్థానిక సంగీతం, నృత్యాలతో ఉత్సవాల రూపంలో నిర్వహిస్తే రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సూచించారు.

ఈ అందాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, రైతుల జీవనోపాధికి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గుంటూరు మిర్చి ఎర్రరంగు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on March 4, 2026 4:56 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago