Movie News

సొంత గడ్డపై విజయ్ రష్మిక వ్రతం

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తొలిసారి సొంతూరికి చేరుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మనపేటలోని తన ఫామ్ హౌస్‌లో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో వివాహం ముగిసిన అనంతరం నేరుగా గ్రామానికి రావడంతో స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు.

విజయ్ పుట్టి పెరిగిన తుమ్మనపేట అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి తర్వాత జరిపే ముఖ్యమైన పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో కాకుండా తన ఊరిలోనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో ఈ వేడుక జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తన చిన్ననాటి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. 

సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ తెచ్చుకున్నాక కూడా తన మూలాలను మర్చిపోకుండా ఇలా ఊరికి రావడం విశేషం. రష్మికతో కలిసి ఫామ్ హౌస్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ పేరుతోనే వీరు తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. 

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ ఆశీస్సులు అందుకున్న ఈ జంట, ఇప్పుడు సొంత గ్రామంలోని పెద్దల దీవెనలు తీసుకుంటున్నారు. వ్రతం కోసం ఫామ్ హౌస్‌ను సంప్రదాయబద్ధంగా అలంకరించారు. కేవలం సన్నిహితుల మధ్యే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, బయట అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఆ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు, బిగ్ సినీ స్టార్స్ రాబోతున్నారు.

Kumar

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

1 hour ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

3 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

3 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

4 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

5 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

5 hours ago