ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని నెలల ముందు ప్రకటించినపుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత ఖర్చు చేసి బిజినెస్ ఎలా వర్కవుట్ చేస్తారు.. రికవరీ ఎలా సాధ్యం అని అందరూ చర్చించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఉన్న పొటెన్షియాలిటికీ ఆ ఖర్చు ఎక్కువేమీ కాదని.. బిజినెస్ కూడా వర్కవుట్ చేయగలమనే ధీమాగా చెబుతున్నాడు నమిత్ మల్హోత్రా.
ఇంతకీ ఈ సినిమాకు ఆయన ఆ స్థాయిలో ఎలా డబ్బులు పెట్టగలుగుతున్నారు.. ఆ బడ్జెట్ అంతా ఎలా సమకూరింది అన్నది ఆసక్తికరం. ఆయన వేరే సంస్థల భాగస్వామ్యం కూడా కోరుకోకుండా సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ ఎలా సమకూర్చుకున్నారనే విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నమిత్ మల్హోత్రా.
‘‘అవును.. రామాయణం మీద నేను 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్లో విజువల్స్, గ్రాండియర్ను అందరూ ప్రశంసించారు. రామాయణం పార్ట్-1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తీయాలనుకున్నపుడు భారీగానే చేయాలనుకున్నాం. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న నటుడితో పాటు అందరికీ ఒకటే అనుమానం కలిగింది.. ఈ సినిమాను ఇంత భారీగా తీయడానికి అవసరమైన నిధులు ఉన్నాయా అని. ఐతే నేను ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి అప్పు చేయకుండా మొదటి భాగాన్ని పూర్తి చేయగలిగాను. ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయో నాక్కూడా తెలియదు.
ఎలా ఇది సాధ్యమైంది అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రాజెక్టు దానంతట అదే డబ్బులు సమకూర్చుకుంది. ఇది కేవలం ఒక సినిమా ప్రాజెక్టు కాదు. దీన్ని బిజినెస్ కోణంలో కూడా చూడకూడదు. ఈ సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చవుతుందో కూడా నాకు తెలియదు. నేను ఏ రోజుకు ఆ రోజు ఖర్చులు చూసుకోవట్లేదు. మనం సరైన సినిమా తీస్తున్నామా లేదా అన్నదాని మీదే నా దృష్టంతా. ఆ విషయంలో ఎంతమాత్రం రాజీపడట్లేదు’’ అని నమిత్ వెల్లడించాడు.
This post was last modified on February 25, 2026 7:10 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…