ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని నెలల ముందు ప్రకటించినపుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత ఖర్చు చేసి బిజినెస్ ఎలా వర్కవుట్ చేస్తారు.. రికవరీ ఎలా సాధ్యం అని అందరూ చర్చించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఉన్న పొటెన్షియాలిటికీ ఆ ఖర్చు ఎక్కువేమీ కాదని.. బిజినెస్ కూడా వర్కవుట్ చేయగలమనే ధీమాగా చెబుతున్నాడు నమిత్ మల్హోత్రా.
ఇంతకీ ఈ సినిమాకు ఆయన ఆ స్థాయిలో ఎలా డబ్బులు పెట్టగలుగుతున్నారు.. ఆ బడ్జెట్ అంతా ఎలా సమకూరింది అన్నది ఆసక్తికరం. ఆయన వేరే సంస్థల భాగస్వామ్యం కూడా కోరుకోకుండా సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ ఎలా సమకూర్చుకున్నారనే విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నమిత్ మల్హోత్రా.
‘‘అవును.. రామాయణం మీద నేను 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్లో విజువల్స్, గ్రాండియర్ను అందరూ ప్రశంసించారు. రామాయణం పార్ట్-1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తీయాలనుకున్నపుడు భారీగానే చేయాలనుకున్నాం. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న నటుడితో పాటు అందరికీ ఒకటే అనుమానం కలిగింది.. ఈ సినిమాను ఇంత భారీగా తీయడానికి అవసరమైన నిధులు ఉన్నాయా అని. ఐతే నేను ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి అప్పు చేయకుండా మొదటి భాగాన్ని పూర్తి చేయగలిగాను. ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయో నాక్కూడా తెలియదు.
ఎలా ఇది సాధ్యమైంది అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రాజెక్టు దానంతట అదే డబ్బులు సమకూర్చుకుంది. ఇది కేవలం ఒక సినిమా ప్రాజెక్టు కాదు. దీన్ని బిజినెస్ కోణంలో కూడా చూడకూడదు. ఈ సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చవుతుందో కూడా నాకు తెలియదు. నేను ఏ రోజుకు ఆ రోజు ఖర్చులు చూసుకోవట్లేదు. మనం సరైన సినిమా తీస్తున్నామా లేదా అన్నదాని మీదే నా దృష్టంతా. ఆ విషయంలో ఎంతమాత్రం రాజీపడట్లేదు’’ అని నమిత్ వెల్లడించాడు.
This post was last modified on February 26, 2026 10:04 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…