ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని నెలల ముందు ప్రకటించినపుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత ఖర్చు చేసి బిజినెస్ ఎలా వర్కవుట్ చేస్తారు.. రికవరీ ఎలా సాధ్యం అని అందరూ చర్చించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఉన్న పొటెన్షియాలిటికీ ఆ ఖర్చు ఎక్కువేమీ కాదని.. బిజినెస్ కూడా వర్కవుట్ చేయగలమనే ధీమాగా చెబుతున్నాడు నమిత్ మల్హోత్రా.
ఇంతకీ ఈ సినిమాకు ఆయన ఆ స్థాయిలో ఎలా డబ్బులు పెట్టగలుగుతున్నారు.. ఆ బడ్జెట్ అంతా ఎలా సమకూరింది అన్నది ఆసక్తికరం. ఆయన వేరే సంస్థల భాగస్వామ్యం కూడా కోరుకోకుండా సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ ఎలా సమకూర్చుకున్నారనే విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నమిత్ మల్హోత్రా.
‘‘అవును.. రామాయణం మీద నేను 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్లో విజువల్స్, గ్రాండియర్ను అందరూ ప్రశంసించారు. రామాయణం పార్ట్-1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తీయాలనుకున్నపుడు భారీగానే చేయాలనుకున్నాం. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న నటుడితో పాటు అందరికీ ఒకటే అనుమానం కలిగింది.. ఈ సినిమాను ఇంత భారీగా తీయడానికి అవసరమైన నిధులు ఉన్నాయా అని. ఐతే నేను ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి అప్పు చేయకుండా మొదటి భాగాన్ని పూర్తి చేయగలిగాను. ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయో నాక్కూడా తెలియదు.
ఎలా ఇది సాధ్యమైంది అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రాజెక్టు దానంతట అదే డబ్బులు సమకూర్చుకుంది. ఇది కేవలం ఒక సినిమా ప్రాజెక్టు కాదు. దీన్ని బిజినెస్ కోణంలో కూడా చూడకూడదు. ఈ సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చవుతుందో కూడా నాకు తెలియదు. నేను ఏ రోజుకు ఆ రోజు ఖర్చులు చూసుకోవట్లేదు. మనం సరైన సినిమా తీస్తున్నామా లేదా అన్నదాని మీదే నా దృష్టంతా. ఆ విషయంలో ఎంతమాత్రం రాజీపడట్లేదు’’ అని నమిత్ వెల్లడించాడు.
This post was last modified on February 26, 2026 10:04 am
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…