థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు వారాల్లో ఇంటికే వస్తున్నప్పుడు వందలు వేలు ఖర్చు పెట్టుకుని టికెట్లు ఎందుకు కొనాలనే ధోరణి జనంలో బాగా పెరిగిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సినిమాలు సైతం నెల రోజులకే డిజిటల్ లో వస్తే ఆడియన్స్ మాత్రం చేయగలిగేది ఏముంది. అందుకే ఇకపై ఎనిమిది వారాల విండో తెచ్చేవిధంగా ఫిలిం ఛాంబర్ పెద్దలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపికయ్యింది.
ప్రాక్టికల్ గా ఇది ఎంత మేరకు సాధ్యమనేది వేచి చూడాలి. ఎందుకంటే థియేటర్లకు పబ్లిక్ రాక తగ్గిన మాటలో నిజముంది కానీ కేవలం దాన్నొక్కటే సాకుగా చూపలేం. బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఇవన్నీ లెక్క చేయరని, బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం వస్తారని చాలాసార్లు ఋజువయ్యింది.
ఎక్కడిదాకో ఎందుకు గత ఏడాది తేజ సజ్జ మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ టికెట్ రేట్ల పెంపు లేకుండా, ఓటిటి స్పేస్ తక్కువగా ఉన్నా సరే వంద కోట్ల వసూళ్లు దాటి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తక్కువ బడ్జెట్ లో తీసిన లిటిల్ హార్ట్స్ తర్వాత ఈటీవీ విన్ లో వస్తుందని తెలిసినా జనం ముప్పై కోట్ల వసూళ్లు చేతికిచ్చారు.
కాబట్టి ఓటిటి అనేది ఒక కారణమే కానీ మొత్తం దానిదే బాధ్యత కాదు. కంటెంట్ క్వాలిటీ మెరుగు పడాలి. ఆషామాషీ కథలకు, వెర్రిమొర్రి కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి ప్రమోషన్లతో ఊదరగడతామనే నిర్మాతల చేతిలో ఆడియన్స్ అంత ఈజీగా మోసపోయేందుకు సిద్ధంగా లేరు.
అదిరిపోవాలి, వందల కోట్లతో తీయమని వాళ్ళు డిమాండ్ చేయడం లేదు. రెండున్నర గంటలు చిరాకు పుట్టించకుండా బాగుందనే ఫీలింగ్ కలిగిస్తే చాలని అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు, పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు ఎంత చేటు చేస్తున్నాయో ఇండస్ట్రీ అగ్రజులు వీలైనంత త్వరగా గుర్తించడం ఎంతో అవసరం.
ఛాన్స్ ఉంది కదాని టయర్ 2 హీరోలకు సైతం టికెట్ రేట్ల జిఓ తెచ్చుకుంటున్న వైనం మొన్న సంక్రాంతికి చూశాం. ప్రొడ్యూసర్లు దీని మీద దృష్టి సారించాలి. ఎయిట్ వీక్స్ విండో అంటే నిర్మాతకు వచ్చే ఓటిటి ఆదాయంలో పెద్ద కోత పడుతుంది. అదంతా థియేటర్లో రికవర్ అవుతుందన్న గ్యారెంటీ లేదు.
బ్లాక్ బస్టర్ అయ్యిందా ఓకే. యావరేజ్ లేదా ఫ్లాప్ అయినా అసలుకే మోసం వస్తుంది. గతంలో దీన్ని కఠినంగా అమలు చేయాలని కొందరు ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. మరి ఈసారైనా హిందీ, మలయాళం తరహాలో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చి టాలీవుడ్ నిర్మాతలందరినీ ఒకే తాటిపైకి తెస్తారో లేదో చూడాలి.
This post was last modified on February 26, 2026 10:52 am
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…