తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ? అనే మాట వినిపించడం సహజం. ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించి.. పచ్చడి చేసుకుని తినడమే కదా.. అనుకుంటే.. ఈ ఏడాది మాత్రం అలా ఉండదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగుల కారణంగా.. ఈ ఏడాది ఉగాది చాలా స్పెషల్ గురూ అని అనకుండా ఉండలేదు.
దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 1) ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కలిపి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు మంత్రి నారా లోకేష్ యుద్ధప్రాతిపదికన రెడీ అవుతున్నారు. దీనిలోనే డీఎస్సీ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ ఉగాది నిరుద్యోగులకు భారీ అవకాశాలనే తీసుకు రానుంది.
2) టిడ్కో ఇళ్లు: ఈ ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. గత ఏడాది 3.5 లక్షల మందికి టిడ్కో ఇళ్లను ఇచ్చారు. ఈ దఫా మరో 2.5 లక్షల మందికి ఈ ఇళ్లను అందించనున్నారు. ఉగాది రోజు వారందరితోనూ గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. సో.. ఇది సొంతింటి కోసం కలలుకంటున్న వారికి మేలు చేసే ఉగాదిగా మార నుంది.
3) రాజధానిలో రెండో దశ పనులకు శ్రీకారం: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. రెండో దశ పనులను కూడా ఉగాది నాడు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
తొలిదశలో అధికారుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రెండో విడతలో ప్రధాన రాజధాని పనులను ప్రారంభించనున్నారు. తద్వారా అమరావతికి వచ్చే రెండేళ్లలో సమగ్రరూపం ఇవ్వనున్నారు. సో.. ఇలా ఈ ఏడాది ఉగాది.. ప్రత్యేకంగా మారనుంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…