తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ? అనే మాట వినిపించడం సహజం. ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించి.. పచ్చడి చేసుకుని తినడమే కదా.. అనుకుంటే.. ఈ ఏడాది మాత్రం అలా ఉండదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగుల కారణంగా.. ఈ ఏడాది ఉగాది చాలా స్పెషల్ గురూ అని అనకుండా ఉండలేదు.
దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 1) ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కలిపి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు మంత్రి నారా లోకేష్ యుద్ధప్రాతిపదికన రెడీ అవుతున్నారు. దీనిలోనే డీఎస్సీ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ ఉగాది నిరుద్యోగులకు భారీ అవకాశాలనే తీసుకు రానుంది.
2) టిడ్కో ఇళ్లు: ఈ ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. గత ఏడాది 3.5 లక్షల మందికి టిడ్కో ఇళ్లను ఇచ్చారు. ఈ దఫా మరో 2.5 లక్షల మందికి ఈ ఇళ్లను అందించనున్నారు. ఉగాది రోజు వారందరితోనూ గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. సో.. ఇది సొంతింటి కోసం కలలుకంటున్న వారికి మేలు చేసే ఉగాదిగా మార నుంది.
3) రాజధానిలో రెండో దశ పనులకు శ్రీకారం: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. రెండో దశ పనులను కూడా ఉగాది నాడు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
తొలిదశలో అధికారుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రెండో విడతలో ప్రధాన రాజధాని పనులను ప్రారంభించనున్నారు. తద్వారా అమరావతికి వచ్చే రెండేళ్లలో సమగ్రరూపం ఇవ్వనున్నారు. సో.. ఇలా ఈ ఏడాది ఉగాది.. ప్రత్యేకంగా మారనుంది.
This post was last modified on February 25, 2026 11:23 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…