సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు ఆసక్తి చూపిస్తారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చినా రాకపోయినా.. తమ తల్లిదండ్రులు సినీ నటులైతే వాళ్ల సినిమాలతో పాటు వేరేవి కూడా చూడడానికి ఉత్సాహం చూపిస్తారు. తల్లిద్రండులు కూడా తమ పిల్లలకు తమ సినిమాలు చూపించాలని ఆశపడతారు.
కానీ ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరైన షాలిని.. తన పిల్లలకు ఇప్పటిదాకా తన సినిమాలు చూపించలేదట. వాళ్లు కూడా ఆమె సినిమాలు చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదట. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. వాళ్లకు సినిమాలు చూసే వయసు ఎప్పుడో వచ్చేసింది. తమిళంలో టాప్ స్టార్ అయిన తండ్రి సినిమాలను వాళ్లు చూడకుండా ఉండరు.
ఐతే 20 ఏళ్ల కిందటే షాలిని సినిమాలు వదిలేయగా.. అంతకుముందు ఆమె నటించిన సినిమాలు ఏవీ అనౌష్క, ఆద్విక్ చూడలేదట. తాను వాళ్లకు తన సినిమాలను చూపించాలని ప్రయత్నించలేదని.. వాళ్లు కూడా తన చిత్రాలు చూడాలన్న ఆసక్తిని ప్రదర్శించలేదని ఒక కార్యక్రమంలో షాలిని చెప్పింది. 90వ దశకంలో అజిత్ సరసన ‘అమర్కలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించినపుడు తనతో ప్రేమలో పడి, కొన్నేళ్లకే అతణ్ని పెళ్లి చేసుకుంది షాలిని.
అంతకంటే ముందు ఆమె సఖి లాంటి క్లాసిక్, ‘కాదలక్కు మర్యాద’ లాంటి బ్లాక్ బస్టర్, ఇంకా పలు చిత్రాల్లో నటించింది. కెరీర్లో చాలా వరకు నటనకు ప్రాధాన్యమున్న, మంచి మంచి పాత్రలే చేసింది షాలిని. ముఖ్యంగా ‘సఖి’లో తన పాత్ర, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి క్లాసిక్స్లో నటించి కూడా పిల్లలకు ఆ సినిమాలు చూపించకపోవడం.. ఆమె పిల్లలు కూడా తల్లి ఎలా నటించిందో చూద్దామని ఆ చిత్రాలను ట్రై చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…