సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు ఆసక్తి చూపిస్తారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చినా రాకపోయినా.. తమ తల్లిదండ్రులు సినీ నటులైతే వాళ్ల సినిమాలతో పాటు వేరేవి కూడా చూడడానికి ఉత్సాహం చూపిస్తారు. తల్లిద్రండులు కూడా తమ పిల్లలకు తమ సినిమాలు చూపించాలని ఆశపడతారు.
కానీ ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరైన షాలిని.. తన పిల్లలకు ఇప్పటిదాకా తన సినిమాలు చూపించలేదట. వాళ్లు కూడా ఆమె సినిమాలు చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదట. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. వాళ్లకు సినిమాలు చూసే వయసు ఎప్పుడో వచ్చేసింది. తమిళంలో టాప్ స్టార్ అయిన తండ్రి సినిమాలను వాళ్లు చూడకుండా ఉండరు.
ఐతే 20 ఏళ్ల కిందటే షాలిని సినిమాలు వదిలేయగా.. అంతకుముందు ఆమె నటించిన సినిమాలు ఏవీ అనౌష్క, ఆద్విక్ చూడలేదట. తాను వాళ్లకు తన సినిమాలను చూపించాలని ప్రయత్నించలేదని.. వాళ్లు కూడా తన చిత్రాలు చూడాలన్న ఆసక్తిని ప్రదర్శించలేదని ఒక కార్యక్రమంలో షాలిని చెప్పింది. 90వ దశకంలో అజిత్ సరసన ‘అమర్కలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించినపుడు తనతో ప్రేమలో పడి, కొన్నేళ్లకే అతణ్ని పెళ్లి చేసుకుంది షాలిని.
అంతకంటే ముందు ఆమె సఖి లాంటి క్లాసిక్, ‘కాదలక్కు మర్యాద’ లాంటి బ్లాక్ బస్టర్, ఇంకా పలు చిత్రాల్లో నటించింది. కెరీర్లో చాలా వరకు నటనకు ప్రాధాన్యమున్న, మంచి మంచి పాత్రలే చేసింది షాలిని. ముఖ్యంగా ‘సఖి’లో తన పాత్ర, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి క్లాసిక్స్లో నటించి కూడా పిల్లలకు ఆ సినిమాలు చూపించకపోవడం.. ఆమె పిల్లలు కూడా తల్లి ఎలా నటించిందో చూద్దామని ఆ చిత్రాలను ట్రై చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…