సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు ఆసక్తి చూపిస్తారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చినా రాకపోయినా.. తమ తల్లిదండ్రులు సినీ నటులైతే వాళ్ల సినిమాలతో పాటు వేరేవి కూడా చూడడానికి ఉత్సాహం చూపిస్తారు. తల్లిద్రండులు కూడా తమ పిల్లలకు తమ సినిమాలు చూపించాలని ఆశపడతారు.
కానీ ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరైన షాలిని.. తన పిల్లలకు ఇప్పటిదాకా తన సినిమాలు చూపించలేదట. వాళ్లు కూడా ఆమె సినిమాలు చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదట. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. వాళ్లకు సినిమాలు చూసే వయసు ఎప్పుడో వచ్చేసింది. తమిళంలో టాప్ స్టార్ అయిన తండ్రి సినిమాలను వాళ్లు చూడకుండా ఉండరు.
ఐతే 20 ఏళ్ల కిందటే షాలిని సినిమాలు వదిలేయగా.. అంతకుముందు ఆమె నటించిన సినిమాలు ఏవీ అనౌష్క, ఆద్విక్ చూడలేదట. తాను వాళ్లకు తన సినిమాలను చూపించాలని ప్రయత్నించలేదని.. వాళ్లు కూడా తన చిత్రాలు చూడాలన్న ఆసక్తిని ప్రదర్శించలేదని ఒక కార్యక్రమంలో షాలిని చెప్పింది. 90వ దశకంలో అజిత్ సరసన ‘అమర్కలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించినపుడు తనతో ప్రేమలో పడి, కొన్నేళ్లకే అతణ్ని పెళ్లి చేసుకుంది షాలిని.
అంతకంటే ముందు ఆమె సఖి లాంటి క్లాసిక్, ‘కాదలక్కు మర్యాద’ లాంటి బ్లాక్ బస్టర్, ఇంకా పలు చిత్రాల్లో నటించింది. కెరీర్లో చాలా వరకు నటనకు ప్రాధాన్యమున్న, మంచి మంచి పాత్రలే చేసింది షాలిని. ముఖ్యంగా ‘సఖి’లో తన పాత్ర, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి క్లాసిక్స్లో నటించి కూడా పిల్లలకు ఆ సినిమాలు చూపించకపోవడం.. ఆమె పిల్లలు కూడా తల్లి ఎలా నటించిందో చూద్దామని ఆ చిత్రాలను ట్రై చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on February 23, 2026 4:00 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…