Political News

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడుగా ఏపీ సీఐడీ అధికారులు న‌మోదు చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో విధులు నిర్వ‌హిస్తున్నారు.

అయితే.. ఈ కేసులో ఆయ‌న‌ను విచారించేందుకు స్థానిక కోర్టు గ‌త ఏడాదే అనుమ‌తి ఇచ్చింది. కానీ, సునీల్ కుమార్‌.. మ‌రోసారి ప‌ట్నా హైకోర్టును ఆశ్ర‌యించి.. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ముంద‌స్తు ర‌క్ష‌ణ పొందారు. ఈ గ‌డువు కూడాపూర్తికావ‌డం.. ఏపీ పోలీసులు ప‌ట్నా హైకోర్టును ఆశ్ర‌యించి.. సునీల్ నాయ‌క్‌పై ఉన్న కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డంతో ప‌ట్నా హైకోర్టు అరెస్టుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌ను బీహార్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

అక్క‌డి నుంచి సునీల్ నాయ‌క్‌ను.. గుంటూరుకు తీసుకురానున్నారు. కాగా.. వైసీపీ హ‌యాంలో రఘురామను క‌స్ట‌డీలోకి తీసుకుని టార్చ‌ర్ చేసిన స‌మ‌యంలో ప‌క్క‌నే సునీల్ నాయ‌క్ కూడా ఉన్నార‌ని… ర‌ఘురామ ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏపీలో డిప్యూటేష‌న్‌పై విధులు నిర్వ‌హిస్తున్నారు. త‌న‌ను క‌స్ట‌డీలో ఎవ‌రు కొట్టారు? ఎవ‌రి ప్రోద్బ‌లంతో కొట్టారు? అనే విష‌యాలు సునీల్ నాయ‌క్‌కు తెలుసున‌ని కూడా.. ర‌ఘురామ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే నాయ‌క్‌ అరెస్టుకు ప‌ట్నా హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

మ‌రోవైపు.. ఈ కేసులోనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాష్ట్ర కేడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను గ‌త ఏడాదే స‌స్పెండ్ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆయ‌న స‌స్పెన్ష‌న్‌ను మ‌రింత కాలం పొడిగించింది. వ‌చ్చే జూన్ 30వ తేదీన ఆయ‌న రిటైర్ కానున్నారు. అయితే.. ఈ కేసుల్లో విచార‌ణ ముగిసే వ‌ర‌కు ఈ స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. సో.. మొత్తంగా ర‌ఘురామను టార్చ‌ర్ చేసిన కేసులో పురోగ‌తి క‌నిపిస్తోంది.

This post was last modified on February 23, 2026 4:30 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago