గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో నెట్టుకొస్తున్నా బిసి సెంటర్లలో కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. ఫంకీ మూడు రోజులకే చేప చుట్టేయగా, హే బలవంత్ కూడా ఏమంత ప్రభావం చూపించేలా కనిపించడం లేదు.
జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో సగానికి పైగా థియేటర్లు రాత్రి షోలు వేయడం ఆపేశాయని సమాచారం. కారణం కనీసం పది మంది ప్రేక్షకులు లేకపోవడమే. కొన్ని చోట్ల మ్యాట్నీలకు సైతం ఈ పరిస్థితి దాపురించింది. సంక్రాంతికి వచ్చిన హడావిడికి అచ్చం రివర్స్ లో చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.
ఇప్పుడు అందరి చూపు రాబోయే విష్ణు విన్యాసం మీద ఉంది. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు రేగాయి. సింగల్ లాగా వినోదానికి లోటు లేకుండా టైం పాస్ చేయిస్తే చాలు యువత హిట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండాలి.
అలాని ఇదేమి చిన్న సినిమా కాదు. ఇరవై కోట్ల దాకా ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. అంటే రికవరీ గట్టిగానే జరగాలన్న మాట. ఎలాగూ నవ్వించే సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి విష్ణు విన్యాసం కూడా వాటి కోవలోకే చేరొచ్చని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఆయ్ ఫేమ్ నయన్ సారిక ఇందులో హీరోయిన్.
కాకపోతే సరిగ్గా విష్ణు విన్యాసం వచ్చిన వారం రోజులకే శ్రీవిష్ణు మరో మూవీ మృత్యుంజయ్ మార్చి 6 విడుదల కానుంది. నిజానికి ఈ రెండు క్లాష్ కావాల్సింది. అదృష్టవశాత్తు తప్పింది. అయినా సరే ఇది ఎక్కువ గ్యాప్ ఏమి కాదు. ముందైతే విష్ణు విన్యాసం యునానిమస్ అనిపించుకుంటే ఆ తర్వాత ఆ రిజల్ట్ మృత్యుంజయ్ కు సానుకూలంగా ఉంటుంది.
రెండు వేర్వేరు జానర్లు కాబట్టి పోలిక రాదు కానీ రెండూ మెప్పించడం అంటే శ్రీవిష్ణుకు సవాలే. గతంలో బాలయ్య, నాని ఈ విషయంలో ఇబ్బంది పడిన వైనం హిస్టరీలో ఉంది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ కనక హిట్ అయితే కనక శ్రీవిష్ణు ఖాతాలో అరుదైన మైలురాయి చేరుతుంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…