గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో నెట్టుకొస్తున్నా బిసి సెంటర్లలో కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. ఫంకీ మూడు రోజులకే చేప చుట్టేయగా, హే బలవంత్ కూడా ఏమంత ప్రభావం చూపించేలా కనిపించడం లేదు.
జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో సగానికి పైగా థియేటర్లు రాత్రి షోలు వేయడం ఆపేశాయని సమాచారం. కారణం కనీసం పది మంది ప్రేక్షకులు లేకపోవడమే. కొన్ని చోట్ల మ్యాట్నీలకు సైతం ఈ పరిస్థితి దాపురించింది. సంక్రాంతికి వచ్చిన హడావిడికి అచ్చం రివర్స్ లో చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.
ఇప్పుడు అందరి చూపు రాబోయే విష్ణు విన్యాసం మీద ఉంది. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు రేగాయి. సింగల్ లాగా వినోదానికి లోటు లేకుండా టైం పాస్ చేయిస్తే చాలు యువత హిట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండాలి.
అలాని ఇదేమి చిన్న సినిమా కాదు. ఇరవై కోట్ల దాకా ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. అంటే రికవరీ గట్టిగానే జరగాలన్న మాట. ఎలాగూ నవ్వించే సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి విష్ణు విన్యాసం కూడా వాటి కోవలోకే చేరొచ్చని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఆయ్ ఫేమ్ నయన్ సారిక ఇందులో హీరోయిన్.
కాకపోతే సరిగ్గా విష్ణు విన్యాసం వచ్చిన వారం రోజులకే శ్రీవిష్ణు మరో మూవీ మృత్యుంజయ్ మార్చి 6 విడుదల కానుంది. నిజానికి ఈ రెండు క్లాష్ కావాల్సింది. అదృష్టవశాత్తు తప్పింది. అయినా సరే ఇది ఎక్కువ గ్యాప్ ఏమి కాదు. ముందైతే విష్ణు విన్యాసం యునానిమస్ అనిపించుకుంటే ఆ తర్వాత ఆ రిజల్ట్ మృత్యుంజయ్ కు సానుకూలంగా ఉంటుంది.
రెండు వేర్వేరు జానర్లు కాబట్టి పోలిక రాదు కానీ రెండూ మెప్పించడం అంటే శ్రీవిష్ణుకు సవాలే. గతంలో బాలయ్య, నాని ఈ విషయంలో ఇబ్బంది పడిన వైనం హిస్టరీలో ఉంది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ కనక హిట్ అయితే కనక శ్రీవిష్ణు ఖాతాలో అరుదైన మైలురాయి చేరుతుంది.
This post was last modified on February 23, 2026 12:25 am
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…