“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2014లో పవన్ కల్యాణ్ రాజకీయాలను విమర్శిస్తూ ఆయన రాసిన పుస్తకం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ పై జనసేన కార్యకర్తలు కేసు పెట్టగా ఆయనను అరెస్టు కూడా చేశారు. దీంతో, ఈ హత్య వెనుక పవన్, జనసేన నేతల హస్తం ఉందంటూ కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం కూడా చేశాయి.
అయితే, అవన్నీ అసత్యాలని ఖమ్మం పోలీసులు తేల్చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీనివాస్ ను ఆయన స్నేహితుడు వేణు మాధవ్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించాడని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు.
పవన్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ పేరు మీద ఉన్న జీఎస్టీని ఆయన మిత్రుడు వేణు మాధవ రెడ్డి వాడుకొని జీఎస్టీ కట్టలేదని, దీంతో, వేణు మాధవ రెడ్డిని శ్రీనివాస్ ఒత్తిడి చేశారని వెల్లడించారు.
ఆ క్రమంలోనే శ్రీనివాస్ అడ్డు తొలగించుకోవాలని వేణు పథకం వేశాడని తెలిపారు. కోటేశ్వరరావు, అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడని వెల్లడించారు. విజయవాడ వెళ్తుండగా నార్కెట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు.
పాలేరు రిజర్వాయర్లో మృతదేహం పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ కేసులో వేణుతో సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…