తమిళ సీనియర్ నటి త్రిష.. ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వరుణ్ మణియన్ అనే నిర్మాతతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ తర్వాత అనూహ్యంగా ఎంగేజ్మెంట్ రద్దయింది. ఆ తర్వాత ఇప్పటిదాకా త్రిష పెళ్లి చేసుకోలేదు. వయసు 40 దాటినా ఇంకా తీరిక లేకుడా సినిమాల్లో నటిస్తోంది.
తన వ్యక్తిగత జీవితం గురించి ఈ మధ్య తమిళ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టాప్ హీరో విజయ్తో ఆమె బంధం గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తాజాగా తమిళనాట దుమారం రేపాయి. ఆ నాయకుడి పేరు నయనార్ నాగేంద్రన్. ఆయన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఇటీవల విజయ్ మీద విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో విజయ్కి అనుభవం లేదని, ఆయన ముందుగా త్రిష ఇంటి నుంచి బయటికి వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై విజయ్ స్పందించలేదు కానీ, త్రిష నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె అడ్వకేట్ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష తరఫున సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాన్ని త్రిష షేర్ చేసింది.
రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తన క్లైంట్ ఊహించలేదని.. త్రిషకు రాజకీయాలతో సంబంధం లేదని.. రాజకీయ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉందని అడ్వకేట్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాల్లోకి తన క్లైంట్ను లాగొద్దని.. ఆమె దృష్టంతా సినిమాల మీదే ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై నాగేంద్రన్ విచారం వ్యక్తం చేశారు. ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని.. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.
This post was last modified on February 16, 2026 7:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…