తమిళ సీనియర్ నటి త్రిష.. ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వరుణ్ మణియన్ అనే నిర్మాతతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ తర్వాత అనూహ్యంగా ఎంగేజ్మెంట్ రద్దయింది. ఆ తర్వాత ఇప్పటిదాకా త్రిష పెళ్లి చేసుకోలేదు. వయసు 40 దాటినా ఇంకా తీరిక లేకుడా సినిమాల్లో నటిస్తోంది.
తన వ్యక్తిగత జీవితం గురించి ఈ మధ్య తమిళ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టాప్ హీరో విజయ్తో ఆమె బంధం గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తాజాగా తమిళనాట దుమారం రేపాయి. ఆ నాయకుడి పేరు నయనార్ నాగేంద్రన్. ఆయన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఇటీవల విజయ్ మీద విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో విజయ్కి అనుభవం లేదని, ఆయన ముందుగా త్రిష ఇంటి నుంచి బయటికి వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై విజయ్ స్పందించలేదు కానీ, త్రిష నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె అడ్వకేట్ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష తరఫున సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాన్ని త్రిష షేర్ చేసింది.
రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తన క్లైంట్ ఊహించలేదని.. త్రిషకు రాజకీయాలతో సంబంధం లేదని.. రాజకీయ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉందని అడ్వకేట్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాల్లోకి తన క్లైంట్ను లాగొద్దని.. ఆమె దృష్టంతా సినిమాల మీదే ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై నాగేంద్రన్ విచారం వ్యక్తం చేశారు. ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని.. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.
This post was last modified on February 16, 2026 7:33 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…