నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చింది. స్టార్ల సరసన సినిమాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె కెరీర్ దాదాపుగా ఆగిపోయినట్లే కనిపించింది.
కానీ ఈ మధ్య మళ్లీ ఆమె తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతున్న పరిస్థితుల్లో నయన్, త్రిష లాంటి వాళ్ల వైపే చూస్తున్నారు వారితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు. ఇటీవలే సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా నటించి మెప్పించింది నయన్.
40 ప్లస్ వయసులోనూ అందం, గ్రేస్తో ఆకట్టుకున్న నయన్.. పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టింది. ఈ సినిమాకు ఆమె ప్రమోషన్లలో కూడా సహకరించడం విశేషం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంత పెద్ద సక్సెస్ కావడంతో టాలీవుడ్లో నయన్ క్రేజ్ పెరిగింది. అలాగే నయన్కు కూడా తెలుగు సినిమాలపై ప్రేమ పెరిగినట్లుంది. వెంటనే ఆమె ఇక్కడ ఇంకో సినిమా అంగీకరించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమాలోనూ నయనే కథానాయికగా ఖరారైనట్లు సమాచారం.
బాలయ్య, నయన్లది ప్రత్యేకమైన కాంబినేషన్. వీరి కలయికలో సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. మూడూ విజయవంతం అయ్యాయి. ‘జైసింహా’ వచ్చిన ఏడెనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీని తెరపై చూడబోతున్నాం. ముంబయి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్స్టర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. వెంకట సతీష్ కిలారుతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. తమన్ సంగీతం అందిస్తాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on February 15, 2026 5:52 pm
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…