మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత ఆయనకు విజయమే లేదు. ఆ తర్వాత ఆయన హీరోగా ఏడు సినిమాలు వచ్చాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ యావరేజ్ అనిపించుకుంది. అంతకుముందు సినిమాలన్నీ డిజాస్టర్లే.
ఐతే తాను ఎంతో నమ్మకం పెట్టుకున్న మాస్ సినిమాలే తన కొంప ముంచేస్తుండడంతో ‘మాస్ రాజా’ ట్యాగ్ పక్కన పెట్టి ఇమేజ్కు భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అందులో భాగమే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. గత చిత్రాలతో పోలిస్తే దాని రిజల్ట్ కూడా బెటరే. దీని తర్వాత అందరికీ పెద్ద షాకిస్తూ ‘ఇరుముడి’ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు రవితేజ. అయ్యప్ప స్వామి మాల ధరించే నేపథ్యంలో రవితేజ సినిమా చేయడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం.
రవితేజ లాగే ఫెయిల్యూర్లతో బాధ పడుతున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అతడికీ ఇది పూర్తి భిన్నమైన సినిమానే. సక్సెస్ కోసం చాలా డెస్పరేట్గా ఉన్న ఈ ఇద్దరూ.. తమ లాగే కాలం కలిసి రాని హీరోయిన్ని ఈ చిత్రం కోసం ఎంచుకున్నారు. ఆమే.. ప్రియ భవాని శంకర్. తమిళంలో కెరీర్ ఆరంభంలో ‘మెయ్యాదమన్’ సహా కొన్ని హిట్లు పడ్డాయి ప్రియకు. కానీ తర్వాత వరుసగా ఫెయిల్యూర్లే ఎదురయ్యాయి. తెలుగులో మూడు సినిమాలు చేసిన ప్రియకు ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర పడింది.
సంతోష్ శోభన్ సరసన నటించిన ‘కళ్యాణం కమనీయం’, గోపీచంద్కు జోడీగా నటించిన ‘భీమా’, సత్యదేవ్ పక్కన చేసిన ‘జీబ్రా’ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో తర్వాత ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అతి పెద్ద అవకాశం ఆమెను పలకరించింది. రవితేజ లాంటి స్టార్ సరసన అవకాశం దక్కింది. మరి దీన్ని ఆమె ఎంతమేర ఉపయోగించుకుంటుందో.. హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఇంతమందికి ‘ఇరుముడి’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
This post was last modified on February 15, 2026 5:52 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…