ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు. జై హనుమాన్ షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం . మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ విజువల్ గ్రాండియర్ అనౌన్స్ మెంట్ వచ్చి ఏడాది దాటిపోయింది.
కాంతార చాప్టర్ 1 వచ్చాక కూడా నెలల తరబడి అప్డేట్స్ లేకుండా పోయాయి. అప్పుడప్పుడు రిషబ్ శెట్టి దీని ప్రస్తావన తెచ్చినా ఫలానా టైంలో మొదలవుతుందని చెప్పలేదు. ఫైనల్ గా కోరుకున్న ముహూర్తం వచ్చేసింది. అయితే ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలు మూవీ లవర్స్ మెదళ్లను ఆక్రమిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
మొదటిది ప్రశాంత్ వర్మకు సంక్రాంతి మీదే గురి. ఖచ్చితంగా ఆ పండగకే రిలీజ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. అది నిజమైన పక్షంలో 2027 సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్,సెన్సార్ వగైరాలన్నింటికి సంవత్సర కాలం సరిపోదు. సో 2028కి షిఫ్ట్ అవ్వాలి.
కానీ అది మరీ దూరమైపోతుంది. ఓటిటి ఒప్పందాల టైంలో ఇబ్బంది తలెత్తవచ్చు. సో దానికన్నా ముందు వచ్చే ఆప్షన్ పరీశీలించినా ఆశ్చర్యం లేదు. రెండోది రాముడిగా ఎవరు నటిస్తారనేది. ప్రశాంత్ వర్మ పలువురు స్టార్లను కలిసి నెరేషన్లు ఇచ్చాడు కానీ ఫైనల్ గా ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.
మూడోది తేజ సజ్జ ఇందులో ఉంటాడా లేదానేది అసలు క్వశ్చన్. అయితే లీగల్ గా హనుమాన్ సీక్వెల్ హక్కులు దాని అసలు నిర్మాతలు ప్రశాంత్ వర్మకు ఇవ్వడం లేదని సమాచారం. సో పూర్తిగా వేరే కథతో జై హనుమాన్ రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్.
అదే నిజమైన పక్షంలో తేజ సజ్జతో అవసరం ఉండదు. అందులోనూ తేజ ఇప్పుడు సోలో హీరోగా మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. క్యామియోలు, స్పెషల్ రోల్స్ చేసే ఉద్దేశం లేదు. సో రిషబ్ శెట్టినే సోలోగా ఉంటాడు. రాముడిని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేస్తే చెప్పలేం. మొత్తానికి స్టార్ట్ కాబోతున్న టైంలో జై హనుమాన్ మరోసారి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యేలా ఉంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…